/rtv/media/media_files/2025/02/22/40aUwC3HqSw1q881MyEr.jpg)
Rajasthan Chief Minister Bhajan Lal Sharma
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దౌసా జైలు ఉన్న ఓ ఖైదీ సీఎంను చంపేస్తానని ఫోన్లో బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రింకు అనే వ్యక్తి వివిధ కేసుల్లో ఖైదీగా దౌసా కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. శుక్రవారం అతడు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశాడు. సీఎం భజన్లాల్ను చంపేస్తానంటూ బెదిరించాడు. రాష్ట్ర హోంమంత్రి జవహర్ సింగ్ బేధమ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన
దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే జైల్లో ఉన్న అతడికి ఫోన్ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో జైలులో ఉన్న మరో అధికారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. అయితే అతడు సీఎంను ఎందుకు బెదిరించాడో అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.
Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. హిడ్మా కూతురు సంచలన నిర్ణయం!
ఇదిలాఉండగా గురువారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. షిండే వాహనాన్ని బాంబుతో పేల్చేస్తామని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ముంబై పోలీసుల(Mumbai Police)కు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. చివరికీ ప్రాథమిక విచారలో ఈ బెదిరింపు అంతా ఓ బూటకమని తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్టు చేశారు.
Also Read: మహా కుంభమేళా రికార్డు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు
Also Read: దొంగిలించిన డబ్బుతో లవర్లతో కలిసి మహాకుంభమేళాకు..చివరకు బిగ్ ట్విస్ట్!