/rtv/media/media_files/tiaXzdjD98hcseS5pURi.jpg)
ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు దొంగలు యత్నించగా.. అందులో ఉంటున్న మహిళ ఒంటరిగా ఎదుర్కొంది. ఆమె ధైర్యసాహసాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్లోని అమృత్సర్లో సెప్టెంబర్ 30న సాయంత్రం వేళ.. జగ్జీత్ సింగ్ అనే నగల వ్యాపారి ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఆ ఇంట్లో అతని భార్య మన్దీప్ కౌర్, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. అయితే మన్దీప్ కౌర్ బట్టలు ఆరేస్తున్న సమయంలో ముగ్గురు మసుగులు ధరించిన దొంగలు ఇంటి సమీపంలో తిరగడాన్ని ఆమె చూసింది. ఆ తర్వాత వాళ్లు గోడ దూకి ఇంటి మెయిన్ గేట్ వద్దకు వచ్చారు.
Also Read: మరో వివాదంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య!
బలవంతంగా డోర్ తెరిచేందుకు యత్నించారు. అప్పటికే అప్రమత్తమైన మన్దీప్ కౌర్ ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంది. ఆ దొంగలు ఇంటి డోర్ తెరవకుండా తన బలమంతా ఉపయోగించింది. గట్టిగా అరుస్తూ చివరికి ఆ డోర్కు లాక్ వేసింది. అలాగే సోఫాను కూడా డోర్ ముందుకు లాగింది. భయపడ్డ తన పిల్లలకు ధైర్యం చెప్పింది. పోలీసులకు, తన భర్తకు ఫోన్ చేసింది. చివరికి ఆ దొంగలు ఇంటి నుంచి పారిపోవడాన్ని కిటికీ నుంచి చూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ధైర్య సాహసాలను నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Robbers tried to loot a house, But the robbers could not do anything in front of the Brave Woman present in the house. The brave woman single-handedly overpowered three robbers🫡, Amritsar
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 1, 2024
pic.twitter.com/NQuAwauAYf