Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

ప్రధాని మోదీ తమిళనాడు రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించారు. రూ.550 కోట్ల వ్యయంతో రైల్వే వంతెనను నిర్మించారు. శ్రీలంకలో 3 రోజుల పర్యటన ముగించుకొని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించారు. ఇది ఇండియాలోనే మొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్.

New Update
pambana 125412

pambana 125412

రామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. పంబన్ బ్రిడ్జ్ అనే రైల్వే వంతెనను రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 72.5 మీటర్ల లిఫ్ట్ నిలువుగా చైన్ లింకప్ ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌ కోటింగ్‌తో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీలంకలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించారు. 

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

రామ నవమి సందర్భంగా అయోధ్యలో సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే రామసేతును వీక్షించడం గురించి ప్రధాని తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది దైవిక యాదృచ్చికమని ప్రధాని అభివర్ణించారు. పూరాణాల్లో పాతుకుపోయిన ఈ పంబన్ బ్రిడ్జ్ ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఆయన చెప్పారు. రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో కలుపుతూ.. ఈ వంతెనను రూ.550 కోట్ల వ్యయంతో నిర్మించారు. 2.08 కి.మీ పొడవున్న ఈ నిర్మాణంలో 99 స్పాన్‌లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్ ఉన్నాయి. ఈ రైల్వే బ్రిడ్జ్ మీదుగా ట్రైన్ వెలుతుంది. కింద నుంచి ఓడలు ప్రయాణిస్తాయి. ఓడలు వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ రెండు ముక్కలుగా పైకి లేస్తోంది. ఇదే దీని స్పెషాలిటీ.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు