ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలను ఆదానీ వ్యవహారం, సంభల్ హింసాకాండ తదితర అంశాలు కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అదానీ వ్యవహారంపై లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలంతా నిరసనకు దిగారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అయితే, ఈ నిరసనలకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు హాజరుకాలేదు. ఇదికూడా చదవండి :Kasturi: ఉదయించే సూర్యుడికి శత్రువుగా ఉంది రెండాకుల గుర్తే..! ఉభయసభలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలను లేవనెత్తడంతో సభలో గందరగోళం నెలకొంది. Also Read: మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవపై పోలీసుల వివరణ.. జరిగింది ఇదేనట దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ తిరిగి 12 గంటలకు సమావేశం కానుంది. ప్రస్తుతం రాజ్యసభ కొనసాగుతోంది. రైల్వే సవరణ బిల్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లు, బ్యాంకింగ్ చట్టాల బిల్లు ఈ రోజు ఉభయ సభల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.