Pahalgam Attack: జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. పర్యటకులను బెంబేలెత్తించేలా ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించి అమాయకుల ప్రాణాలు తీశారు. అయితే ప్రాణభయంతో పరిసరప్రాంతంలో ఉన్న వారంతా పరుగులుపెడుతుంటే.. ఉగ్రవాదుల దాడిని అడ్డుకునేందుకు హీరోలా ముందుకొచ్చాడు హార్స్రైడర్ సయీద్ అదిల్ హుస్సేన్ షా. పర్యటకులపై దాడికి పాల్పడుతుంటే అడ్డున్నాడు. ఉగ్రమూకల నుంచి తుపాకులు లాగేసుకునేందుకు ప్రయత్నించి, చివరికి వీరుడిలా ప్రాణాలు విడిచాడు.
గుర్రం మీద తీసుకువెళ్తున్నపుడే..
ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ పర్యటక ప్రాంతంలో దాడి జరిగింది. సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లాలంటే బైసరన్ మీదుగా వెళ్లాలి. నడక, గుర్రపుస్వారీ తప్ప మరో మార్గం లేదు. ట్రెక్కింగ్కు వచ్చే వారంతా క్యాంపులు ఏర్పాటుచేసుకుంటారు. ఇందులో భాగంగానే హుస్సేన్.. పర్యటకులను పార్కింగ్ ప్రాంతం నుంచి బైసరన్ పచ్చిక బయళ్ల వద్దకు గుర్రం మీద తీసుకువెళ్తున్నపుడే ఈ అటాక్ జరిగింది. అతని విరోచిత మరణం తన కుటుంబాన్ని రోడ్డున పడేలా చేసినందుకు బాధగానే ఉంది. హుస్సేన్ ఆదాయంపైనే భార్యాపిల్లలు, తల్లిదండ్రలు ఆధారపడ్డారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/04/23/6v0eNVd9p6HJ8oygJyYs.jpeg)
Also Read: Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!
ఇక హుస్సేన్ మృతిపై స్పందించిన పేరెంట్స్.. ‘పనికోసం మా కొడుకు పహల్గాం వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు దాడి జరిగినట్లు తెలిసింది. మేము వెంటనే ఫోన్ చేశాం కానీ కలవలేదు. స్విచ్ఛాఫ్ వచ్చింది. సాయంత్రం 4.40 గంటల సమయంలో ఫోన్ రింగ్ అయింది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేయగా ఉగ్రదాడిలో మా బిడ్డకు గాయలైనట్లు చెప్పారు’ అని హుస్సేన్ తండ్రి సయ్యద్ హైదర్ షా చెప్పారు. కానీ చివరకు హుస్సేన్ మరణవార్త తెలిసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.
J&K Terror Attack | telugu-news | today telugu news J&K Terror Attack