Maharashtra : నేను గెలిస్తే బ్రహ్మచారులందరికీ పెళ్లి చేస్తా..!

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్సీ పీ వర్గానికి చెందిన రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ అనే నేత ఇచ్చిన హామీ ఒకటి వైరల్‌ అవుతుంది. తాను గెలిస్తే పార్లిలోని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇవ్వడమే ఇందుకు కారణం.

New Update
marriege

మహారాష్ట్ర

ఎన్నికల పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు రకరకాల హామీలు ఇవ్వడం అనేది సర్వసాధారణ విషయం. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఒకటి తాజాగా వైరల్‌ గా మారింది.  బీడ్ జిల్లాలోని పార్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే పార్లిలోని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు జరిపించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Also Read:  Pawan Kalyan: వాలంటీర్లకు బిగ్‌ షాక్‌...డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!

మంగళవారం సాయంత్రం పార్లిలో నిర్వహించిన ర్యాలీలో రాజేసాహెబ్ ప్రసగింస్తూ.. పార్లీ అబ్బాయిలకు జాబ్స్‌ ఉన్నాయా? లేక ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? అని పెళ్లికి ముందు పెద్దలు ఎంక్వైరీలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇవ్వకుంటే ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గార్డియన్ మంత్రి ధనంజయ్ ముండే పరిశ్రమలు స్థాపన, ఉద్యోగ కల్పనను పట్టించుకోకుంటే  బ్యాచిలర్లు ఏం చేస్తారని అడిగారు. తాను గెలిస్తే వారందరికీ పెళ్లిళ్లు జరిపించి, బతికేందుకు ఓ దారి చూపిస్తానని మాట ఇచ్చారు.

Also Read:  Australia: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజేసాహెబ్ హామీపై ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధికార ప్రతినిధి అంకుష్ కాక్డే మాట్లాడుతూ.. మరాఠ్వాడాలో యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని, గత దశాబ్దకాలంగా ఇక్కడ ఉద్యోగం అన్న మాటే లేదని పేర్కొన్నారు. 

Also Read:  Jet Airways కథ ముగిసినట్లే..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

మరాఠ్వాడాను అభివృద్ధి చేశామని బీజేపీ, దాని మిత్రపక్షాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటిదేమీ లేదని విమర్శించారు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేకపోవడం సామాజిక సమస్యగా మారిందని పేర్కొన్నారు. కాబట్టి యువతకు పెళ్లిళ్లు జరిపిస్తామని ఎవరైనా హామీ ఇస్తే అందులో తప్పేమీ లేదన్నారు.

Also Read: Anil Ambani: అనిల్‌ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: మరో కుట్రకు పాల్పడుతున్న పాక్.. ఇదే కనుక జరిగితే అంతం తప్పదు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
BREAKING NEWS LIVE

BREAKING NEWS LIVE

🔴Live News Updates: 

BREAKING: మరో కుట్రకు పాల్పడుతున్న పాక్.. ఇదే కనుక జరిగితే అంతం తప్పదు

పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్‌కు వరుస షాక్‌లు ఇచ్చింది. దేశంలో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాక్ పౌరులు దేశంలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో పాకిస్తాన్ మరో కుట్రకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అనుమానితులను నేపాల్ ద్వారా భారత్‌కు పంపాలని దాయాది దేశం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా

ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?

సరిహద్దుల్లో హై అలర్ట్..

సమాచారం అందుకున్న భద్రతా దళాలు వెంటనే భారత్-నేపాల్ సరిహద్దుల్లో నిఘాను పెంచారు. అలాగే అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టడం ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతాలు అన్నింటిలో హైఅలర్ట్ విధించారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అడవులలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. నేపల్ నుంచి వచ్చే ప్రతీ పౌరుడిని కూడా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!

ఇది కూడా చూడండి: Cherry Tomatoes: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!

 

 

  • May 22, 2025 10:19 IST

    Youtuber Jyothi Malhotra Case: జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధం లేదంటున్న పోలీసులు

    యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు పోలీసులు. ఆమెకు అన్నే తెలిసే పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ అధికారులతో మాత్రం సంప్రదింపులు కొనసాగించిందని అంటున్నారు.

     

    Jyothi Malhotra Spent Pakistan Money on Foreign tours, luxury hotels
    Jyothi Malhotra Spent Pakistan Money on Foreign tours, luxury hotels

     



  • May 22, 2025 10:17 IST

    Street Vendors: వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డులు

    వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధిను తీసుకొచ్చింది. గతేడాది దీన్ని నిలిపివేయడంతో వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారికి క్రిడెట్ కార్డులను పంపిణీ చేయాలని భావిస్తోంది.

    Street vendors
    Street vendors

     



  • May 22, 2025 09:34 IST

    Agniveers: ఆపరేషన్ సిందూర్‌లో అగ్నివీరులదే కీలక పాత్ర..

    ఆపరేషన్ సిందూర్‌లో అగ్నివీరులు కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. సైన్యంలో కీలక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో పనిచేసిన వీళ్లు శత్రు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

    3,000 Agniveers braved Pak assault in Operation Sindoor, guarded key installations
    3,000 Agniveers braved Pak assault in Operation Sindoor, guarded key installations

     



  • May 22, 2025 08:35 IST

    Bharat Biotech: భారత్ బయోటెక్‌ నుంచి కలరా టీకా.. క్లినికల్‌ పరీక్షల్లో విజయవంతం

    భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తోన్న కలరా టీకా అయిన 'హిల్‌కాల్‌' మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో సక్సెస్‌ అయ్యింది. కలరా వ్యాధికి కారణమయ్యే ఇనబా సెరోటైప్, ఒగావా.. ఈ రెండింటి పైనా కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు నిర్ధరించారు.

    Bharat Biotech's cholera vaccine successfully completes Phase-III trials
    Bharat Biotech's cholera vaccine successfully completes Phase-III trials

     



  • May 22, 2025 08:34 IST

    Uber: అలాంటి వేషాలు చెల్లవ్..ఊబర్ కు కేంద్రం నోటీసులు

    వేగంగా పికప్ కావాలంటే టిప్ ఇవ్వాలి అనే అడ్వాన్స్ టిప్ మోడల్ ను ప్రవేశపెట్టింది ఊబర్. దీనిపై కేంద్రం మండిపడింది. ఈ పద్ధతి చాలా అన్యాయమని...ఊబర్ యాజమాన్యం వెంటనే దీనికి సమాధానం ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. 

    cab
    Uber Advance Tip

     



Advertisment
Advertisment
Advertisment