BIG BREAKING : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి బాంబు బెదిరింపు!

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది.  నాగ్పూర్లోని గడ్కరీ నివాసాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ ఆదివారం (ఆగస్టు 3, 2025) ఉదయం 112 అనే అత్యవసర హెల్ప్‌లైన్‌కు ఒక కాల్ వచ్చింది.

New Update
nagapur

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది.  నాగ్పూర్లోని గడ్కరీ నివాసాన్ని పేల్చివేస్తామని బెదిరిస్తూ ఆదివారం (ఆగస్టు 3, 2025) ఉదయం 112 అనే అత్యవసర హెల్ప్‌లైన్‌కు ఒక కాల్ వచ్చింది. ఈ కాల్ వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమై, గడ్కరీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్‌తో ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు, కానీ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో ఇది ఫేక్ బెదిరింపు కాల్ అని నిర్ధారించారు. పోలీసులు ఆ కాల్ చేసిన మొబైల్ నెంబర్‌ను ట్రేస్ చేసి, నాగ్పూర్‌కు చెందిన ఉమేష్ విష్ణు రౌత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఒక దేశీ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు రౌత్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక గల ఉద్దేశ్యం ఏమిటని తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం గడ్కరీ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. గతంలో కూడా 2023 జనవరిలో గడ్కరీ కార్యాలయానికి ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ కేసులో అప్పటి నిందితుడు కర్ణాటకలోని బెళగావి జైలులో ఉన్నట్లు తేలింది.   అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని, అతనిపై గతంలో ఎలాంటి కేసులు లేవని నాగ్‌పూర్ డీసీపీ ఎస్ రుషికేశ్ రెడ్డి వెల్లడించారు. ఈ సంఘటన తర్వాత గడ్కరీ నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసినట్లుగా వెల్లడించారు. 

ఫ్లై ఓవర్ మ్యాన్

నితిన్ గడ్కరీ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి నాయకుడిగా ప్రారంభించారు. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) వంటి సంస్థలలో చురుగ్గా పాల్గొన్నారు. 1989లో ఆయన మొదటిసారి మహారాష్ట్ర శాసన మండలికి ఎన్నికయ్యారు. 1995 నుండి 1999 వరకు మహారాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా పనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలోనే ఆయన అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టారు. ముఖ్యంగా, ముంబై-పూణే ఎక్స్​ప్రెస్​వే నిర్మాణం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీనితో ఆయనకు ఫ్లై ఓవర్ మ్యాన్ అనే పేరు కూడా వచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 2009 నుండి 2013 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పదవిలో అతి తక్కువ వయస్సులో పనిచేసిన నాయకులలో ఆయన ఒకరు. 2014 నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ పదవిలో ఆయన సుదీర్ఘ కాలం సేవలందిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు