/rtv/media/media_files/2025/08/18/mumbai-rains-2025-08-18-10-17-19.jpg)
Mumbai Rains
Mumbai Rains: ముంబయిలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం మరోసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వరుసగా రెండవ రోజు(Mumbai Rains Today) ఈ హెచ్చరిక కొనసాగుతోంది. గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల ప్రభావంతో ముంబయి అంతటా ముంపుకు గురైంది, అలాగే రవాణా లో కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక(Mumbai Rains News) జారీ చేసింది.
VIDEO | Mumbai: Waterlogging on Malabar Hill road as heavy rains lash the city.
— Press Trust of India (@PTI_News) August 18, 2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/jWGEgtaQYl
ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్.. (Mumbai Yellow Alert)
ముంబయి నగరంలోని బోరివలి, థానే, కల్యాణ్, ములుండ్, పోవై, సాంటాక్రూజ్, చెంబూర్, వర్లీ, నవి ముంబయి, కొలాబా ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరిక కొనసాగుతోంది. ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ అందించిన నాలుగు స్థాయిల హెచ్చరికలలో మూడవ స్థాయి హెచ్చరిక ఇది. కొన్ని ఇతర ప్రాంతాలు ముఖ్యంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలలో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు కొనసాగుతున్నాయి.
Also Read: మరో గంటలో తెలుగు రాష్ట్రాల్లో కండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ముంబయిలో గంటకు 5 నుండి 15 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా మోస్తరు వర్షాలు, తక్కువ స్థాయి గాలి వానలు ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం నుండి వర్షపు తీవ్రత కొంత తగ్గినప్పటికీ, మరోసారి వాతావరణం మేఘావృతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల తీవ్రమైన వర్షం కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే శనివారం ముంబయిలో భారీ వర్షాలు కురవడంతో రెడ్ అలర్ట్(Mumbai Red Alert Heavy Rainfall) కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో, లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. రాత్రి పొద్దుపోయే వరకు వర్షం కొనసాగింది, దీనివల్ల లోకల్ ట్రైన్లు నిలిచిపోయాయి, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే, శనివారం రాత్రి విక్రోలి పార్క్సైట్ ప్రాంతంలో మట్టిపెళ్లలు పడి ఇద్దరు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Also Read: Delhi Highway Projects: ఢిల్లీలో అభివృద్ధిని చూసి వాళ్లు ఓర్వలేక పోతున్నారు: ప్రధాని మోదీ
శనివారం కోలాపూర్, అమరావతి, వర్ధా, నాగపూర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ కాగా, సోమవారం నాటికి నాశిక్, ఖండాలా, భీమశంకర్ రిజర్వ్, పుణే, మహాబలేశ్వర్, కోలాపూర్, సతారా వంటి ప్రాంతాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
ముంబయి నగర వాసులు వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఎంతో అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు వెళ్లోద్దని సూచిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా ముందస్తు ఏర్పాట్లతో ముమ్మరంగా పనిచేస్తోంది. రాబోయే రోజుల్లో వర్షపు పరిస్థితులు ఎలా మారతాయన్నది ముంబయి నగరంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.