/rtv/media/media_files/2025/06/02/y4lXqBRJ1wXIXsghPVac.jpg)
Madhya Pradesh govt launches sensational scheme for poor girls marriage
Viral News: పెళ్లి చేసుకునే ఆడపిల్లలకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన స్కీమ్ తీసుకొచ్చింది. 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన'లో భాగంగా రూ.55వేలు, 32అంగుళాల కలర్ టీవీ, స్టవ్, ఫ్యాన్, మంచం, అల్మారా వివాహ సహాయంగా అందిస్తోంది. ప్రభుత్వమే సామూహిక వివాహ వేడుకలను నిర్వహిస్తుంది. అయితే ఇందుకోసం ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి అర్హులెవరు అనే అంశాలు ఇలా ఉన్నాయి.
పేద కుటుంబాలకు గౌరవంగా..
2006లో ప్రారంభించిన ఈ పథకం ఆడపిల్లలుగల పేద కుటుంబాలు గౌరవంగా పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. ఇందులో కేవలం డబ్బు మాత్రమే కాదు ఇతర ఖర్చులను తగ్గించేందుకు పెళ్లి వస్తువులను కొనిపెడుతుంది. కలర్ టీవీ, స్టవ్, ఫ్యాన్, మంచం, అల్మారా తదితర వస్తువులను పెళ్లి వరకట్నంలో అందిస్తుంది. ఇది తమకెంతో భారాన్ని తగ్గిస్తుందని పేద పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వస్తువుల లిస్ట్:
LPG కనెక్షన్ + స్టవ్.
32 అంగుళాల కలర్ టీవీ.
స్టీల్ అల్మారా, మంచం, ప్రెషర్ కుక్కర్.
గోడ గడియారం, డైనింగ్ టేబుల్.
వధువు బట్టలు, ఇతర అవసరమైన వస్తువులు.
ఎవరికి వర్తిస్తుంది?
అమ్మాయి మధ్యప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
అమ్మాయి కనీస వయస్సు 18 సంవత్సరాలు.
అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు.
సామూహిక వివాహంలో మాత్రమే వివాహం తప్పనిసరి.
సొంత వివాహానికి చెల్లదు.
విడాకులు తీసుకున్న మహిళలు కూడా అర్హులు (సర్టిఫికేట్ అవసరం).
వివాహానికి కనీసం 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
సమీపంలోని నాగర్ నిగమ్/పంచాయతీ కార్యాలయం నుండి ఫారమ్ తీసుకోవాలి.
సరైన సమాచారం, ఇతర స్థానిక ఫ్రూఫ్ పత్రాలతో ఫారమ్ నింపాలి.
స్థానిక అధికారి ధృవీకరణ చేస్తారు.
షెడ్యూల్ చేసిన తేదీన సామూహిక వివాహంతోపాటు స్కీమ్ ప్రయోజనాల పంపిణీ.
అవసరమైన పత్రాలు:
వధూవరుల ఆధార్ కార్డు.
జనన ధృవీకరణ పత్రం.
కుల ధృవీకరణ పత్రం.
పాస్పోర్ట్ సైజు ఫోటో.
విడాకుల ధృవీకరణ పత్రం.
అమ్మాయి పేరు మీద బ్యాంకు ఖాతా.
రిజిస్టర్డ్ శ్రామిక్ కార్డ్ (ఏదైనా ఉంటే)