/rtv/media/media_files/2025/11/13/marco-2025-11-13-10-23-30.jpg)
ఢిల్లీ బాంబు పేలుడు కేసుపై భారత అధికారులు చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దానికి వెనుక ఎవరు ఉన్నారనేదికనిపెట్టేశారు. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కూ రూబియో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తునకు సాయం చేసేందుకు తాము ముందుకొచ్చామని.. కానీ ఆ అవసరం భారత్కు లేదని వ్యాఖ్యానించారు. కెనడాలో జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత ప్రభుత్వం ఢిల్లీ పేలుడు కేసు విచారణకు ఎన్ఐఏ 10 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. అలాగే ఈ సంఘటన తర్వాత ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయం కూడా స్పందించింది. ఢిల్లీలో జరిగిన భయంకరమైన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించే ఆలోచిస్తున్నాం. ఈ బాధ నుంచి వారు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని కొత్త రాయబారి సెర్గియోగోర్ అన్నారు.
US Secy of state Marco Rubio on Delhi terror incident
— Sidhant Sibal (@sidhant) November 13, 2025
"It is clearly a terrorist attack"
"India doing very good job carrying out investigation"
"US has offered help, but India capable of investigation" pic.twitter.com/a0Ol6uw1OJ
“The Indians need to be commended. They have been very professional and in how they have carried out this investigation. This was very clearly a terrorist attack,” says U.S. Secretary of State Marco Rubio on Red Fort blasts pic.twitter.com/qyoIKxTB6h
— Shashank Mattoo (@MattooShashank) November 13, 2025
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..
ఇక ఈ జీ7 సమావేశాల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ , మార్కోరూబియోతో భేటీ అయ్యారు. ఇరువురూ మంత్రులూ భారత, అమెరికా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇందులో బాగంగానే ఢిల్లీ పేలుడుపై కూడా చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Also Read: Delhi Blast: రూట్ మార్చిన ఉగ్రవాదులు..టర్కీ నుంచి దాడులకు ప్లాన్
Follow Us