Jammu and Kashmir: భారీగా ఆయుధాలు.. పేలుడు పదార్థాలు

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్‌లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. కుప్వారా జిల్లాలో టెర్రరిస్ట్ స్థావరాలు గుర్తించారు. అక్కడ భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 5 AK47, 8 మేగ‌జైన్లు, పిస్తోల్‌, 660 రౌండ్ల బుల్లెట్లు దొరికాయి.

New Update
Weapons in Jammu and Kashmir

పహల్గామ్ టెర్రర్ అటాక్ ఉద్రిక్త పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్‌ను జల్లెడ పడుతుంది. పాక్ సరిహద్దులో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యటకులపై దాడి చేసిన వారు కూడా జమ్మూ లోనే ఉండే అవకాశం ఉంది. భారత నిఘా వ‌ర్గాలు కూడా ఉగ్రవాదుల క‌ద‌లిక‌లను క్లోస్‌గా పరిశీలిస్తున్నాయి. జ‌మ్మూక‌శ్మీర్ కుప్వారా జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ పసిగట్టాయి.

 

Also read: Road Accident: పారిశుద్ధ్య కార్మికుల మీదకి దూసుకెళ్లిన వ్యాన్.. ఆరుగురు మృతి

పక్కా సమాచారంలో స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్, ఆర్మీ బ‌ల‌గాలు క‌లిసి జాయింట్‌గా మాచిల్ జిల్లాలో కూంబింగ్ నిర్వహించాయి. ఈ కూంబింగ్‌లో భాగంగా ఉగ్రవాదులు స్థావరాలు బయటపడ్డడాయి. అందులో భారీగా ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు ఉన్నాయి. వాటిని ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. AK 47 గన్స్, మేగ‌జైన్లు, గన్స్, పేలుడు ప‌దార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదు AK47 రైఫిల్స్, ఎనిమిది AK-47 మేగ‌జైన్లు, ఒక పిస్తోల్‌తోపాటు మేగ‌జైన్, 660 రౌండ్ల బుల్లెట్లతో పాటు ఇత‌ర ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 

Also read: Pope Francis: ఇక సెలవు.. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు (VIDEO)

(weapons | Jammu and Kashmir | Kupwara | indian-army)

Advertisment
Advertisment
తాజా కథనాలు