Bhargavastra: భారత్ చేతిలో 'భార్గవాస్త్ర'.. టర్కీ డ్రోన్లు ఇక తుక్కు తుక్కే!

భారత రక్షణ వ్యవస్థలోకి మరో అధునాతన వ్యవస్థ వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భార్గవాస్త్ర పరీక్షలు విజయవంతం అయ్యాయి. ఈ భార్గవాస్త్ర డ్రోన్లను వెంటపడి నాశనం చేయనుంది. ఒకేసారి 64 లక్ష్యాలను ట్రాక్ చేసి.. దెబ్బకొట్టే సత్తా భార్గవాస్త్రకు ఉంది.

New Update

ఇటీవల భారత్-పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల సమయంలో శత్రు దేశం మనపైకి వందలాది డ్రోన్లను దాడికి ఉపయోగించిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్లను మన రక్షణ వ్యవస్థ ఎప్పటికప్పుడు కూల్చివేసింది. తాజాగా డ్రోన్లను కట్టడి చేయడానికి భారత్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థకు భార్గవాస్త్రగా నామకరణం చేశారు. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్ సంస్థ ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఎన్ని డ్రోన్లు ఒకే సారి వచ్చినా.. ఆ సమూహాన్ని వెంటాడి నాశనం చేసే సామర్థ్యం ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థకు సొంతం. 

ఒకే సారి 64 లక్ష్యాలను ట్రాక్ చేసి దెబ్బ కొట్టే సత్తా..

2.4 కిలోమీటర్ల దూరం నుంచే శత్రు డ్రోన్లను భార్గవాస్త్ర నాశనం చేస్తుంది. ఇది 6-10 కి.మీ. దూరంలో ఉన్న చిన్న డ్రోన్‌లను సులువుగా గుర్తిస్తుంది. ఒకేసారి 64 లక్ష్యాలను ట్రాక్ చేసి.. దెబ్బకొట్టే సత్తా భార్గవాస్త్రకు ఉంది. ఇందుకు సంబంధించిన పరీక్షలను ఒడిశాలో నిర్వహించగా.. సక్సెస్ అయ్యాయి. దీంతో భారత అమ్ముల పొదలోకి మరో అధునాతన అస్త్రం చేరింది. 

టెక్నాలజీలో మేం టాప్ అని గొప్పలు చెప్పుకునే చైనాకు కూడా భారత్ ఇప్పటికే చుక్కలు చూపించింది. పాకిస్తాన్ కు ఆ దేశం అందించిన డిఫెన్స్ సిస్టాన్ని పని చేయకుండా చేసింది. భారత మిస్సైల్స్ పాక్ రక్షణ వ్యవస్థకు చిక్కకుండా పాక్ లోకి దూసుకెళ్లి అక్కడ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయి. దీంతో చైనాను నమ్ముకుని భారత్ పై కాలు దువ్విన పాక్ పరువు పోయింది.  

(telugu-news | latest-telugu-news | IND-PAK War )

Advertisment
Advertisment
తాజా కథనాలు