/rtv/media/media_files/2025/02/25/wMmy8hgkuIRpQSvXWWss.jpg)
internet restrictions Photograph: (internet restrictions)
Internet shutdown: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. ఇక్కడ స్వేచ్ఛ, హక్కులకు తిరుగులేదు అని చెప్పుకుంటాము. కానీ.. ఇంటర్నెట్పై ఆంక్షలు విధించడంలో మాత్రం ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిసింది భారత్. 2024లో ఇంటర్నెట్ షట్ డౌట్ చేసిన దేశాల వారిగా చూస్తే ఇండియా 84 సార్లు ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించి రెండో స్థానంలో ఉంది. మయన్మార్ మొదటి స్థానంలో ఉంది. 2024లో మయన్మార్ 85 సార్లు ఇంటర్ నెట్పై షెడ్ డౌట్ ప్రకటించింది.
ఇక ప్రజాస్వామ్య దేశాల పరంగా చూస్తే భారత్ మొదటి స్థానంలో ఉన్నది. 2023లో ఇండియాలో 113 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. 2023తో పోలిస్తే 2024లో ఈ సంఖ్య తగ్గినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని నివేదిక వెల్లడించింది.
#इंटरनेट_शटडाउन के मामले में वैश्विक सूची में #भारत नंबर दो पर!#India #म्यांमार से मात्र 1 अंक कम!
— ved prakash vidrohi (@vpvidrohi) February 25, 2025
वही भारत #पाकिस्तान से भी 63 अंक ज्यादा!
लोकतांत्रिक भारत के लिए शर्मनाक स्थिति!#InternetShutdownsWorldIndex #InternetShutdowns pic.twitter.com/Cem6rcjQbr
2018 నుంచి 2023 వరకు ఈ ర్యాకింగ్స్లో మన దేశం మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఇప్పటి వరకు భారత్లో అత్యధిక సార్లు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన రాష్ట్రాలు మణిపూర్ – 21, హర్యానా – 12, జమ్ము కశ్మీర్ – 12 లు ఉన్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 296 సార్లు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించారు. 2023లో 39 దేశాల్లో 283 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు.