అమెరికా రంగంలోకి దిగి చర్చలు జరపడంతో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఇండియా షరతుల ప్రకారమే కాల్పుల విరమణ జరిగినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ కోసం మొదట పాకిస్తాన్ ఇండియాను సంప్రదించింది. ఇందుకోసం మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు పాకిస్తాన్ ISI చీఫ్ కాల్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కాల్పుల విరమణ జరిగినా పాకిస్తాన్ పై ఒత్తిడి కొనసాగుతుందని భారత్ స్పష్టం చేస్తోంది. పాక్ ఏ చిన్న తప్పు మళ్లీ చేసినా యుద్ధం మొదలు అవుతుందని తేల్చి చెబుతోంది.
India and Pakistan reached an understanding after the Pakistan side reached out to India. There are no pre-conditions and post-conditions. Indus Water Treaty remains in abeyance. And all other measures remain suspended. India's position on Terrorism remains the same: MEA Sources https://t.co/4hTwg2x86v
— ANI (@ANI) May 10, 2025
అమల్లోనే సంధూ జలాల ఒప్పందం..
సింధు నది జలాల ఒప్పందం రద్దు అమల్లోనే ఉంటుందని భారత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా.. పాకిస్తాన్ సోషల్మీడియా, యూట్యూబ్ ఛానెళ్లపైనా నిషేధం కంటిన్యూ అవుతుందని సమాచారం. పాకిస్తాన్ పౌరుల వీసాల రద్దు నిర్ణయం కూడా వెనక్కి తీసుకోబోమని ఇండియా తేల్చి చెబుతోంది. పాకిస్తాన్తో అన్ని రకాల వ్యాపారం, వాణిజ్యంపైనా నిషేధం కొనసాగుతుందని సమాచారం.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi holds a meeting with Defence Minister Rajnath Singh, NSA Ajit Doval, CDS and Chiefs of all three Services, at 7, LKM. pic.twitter.com/Zcx3BWo2cA
— ANI (@ANI) May 10, 2025
పాకిస్తాన్ విమానాలకు గగనతల నిషేధం కూడా కొనసాగుతుందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రచర్యనైనా యుద్ధంగానే భావిస్తామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు జరపబోం అని భారత్ స్పష్టం చేస్తోంది.
(india operation sindoor | telugu-news | telugu breaking news)