TN High Court : వేశ్యతో పోలుస్తూ హిందువులపై జోక్..  తమిళనాడు మంత్రిపై కేసు నమోదు!

శైవులు, వైష్ణవులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె పొన్ముడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తమ ఆదేశాలను విస్మరిస్తే స్వయంగా చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.

New Update
high-court tn

high-court tn

శైవులు, వైష్ణవులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె పొన్ముడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తమ ఆదేశాలను విస్మరిస్తే స్వయంగా చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఆదేశాన్ని పాటించకపోతే, సుమోటోగా కేసు నమోదు చేస్తామని కోర్టు తెలిపింది.

వారం క్రితం పొన్ముడి చేసిన ప్రసంగంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఈ ఆదేశాలు జారీ చేశారు. హిందూ విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుని మంత్రి పొన్ముడి ద్వేషపూరిత ప్రసంగం చేశారని, శైవ, వైష్ణవ మత చిహ్నాలను అపహాస్యం చేయడానికి వేశ్యలతో కూడిన అసభ్యకరమైన సారూప్యతను ఉపయోగించారని పిటిషనర్ బి జగన్నాథ్ ఆరోపించారు. 

Also read : Arjun Daughter: విదేశీ ప్రియుడితో హీరో అర్జున్ కూతురు ఎంగేజ్మెంట్! ఫొటోలు వైరల్

హిందువులను లక్ష్యంగా చేసుకుని

మంత్రి ప్రసంగం అవమానకరమైనదిగా ఉండటమే కాకుండా, సనాతన ధర్మంపై మత సామరస్యాన్ని, ద్వేషాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఉందని, ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిందని పిఐఎల్ ఆరోపించారు. ఓ సెక్స్‌ వర్కర్‌ గురించి మాట్లాడే క్రమంలో మంత్రి హిందూ మత చిహ్నాలను లైంగిక భంగిమలతో పోలుస్తూ ఆయన చేసిన వివాదాస్పద జోక్‌ తమిళనాడులో రాజకీయ దుమారానికి కారణమైంది. కాగా అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ పొన్ముడిని సీఎం స్టాలిన్‌ పార్టీ పదవి నుంచి తప్పించారు. ఆయన్ను డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి స్థానం నుండి తొలగించారు.  

Also read : VIRAL VIDEO: దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని ఫీలవుతున్నారా? ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు