Fighting in wedding : పెళ్లిలో భోజనం ఆలస్యం...రెచ్చిపోయిన బంధువులు

ఉత్తరప్రదేశ్‌  రాష్ట్రంలోని గోవర్థన్‌పూర్‌ గ్రామంలో సబీర్ అనే వ్యక్తి తన కూతురు పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. పెళ్లి భోజనం ఆలస్యమైందని వరుడి తరఫున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చిన్న గొడవగా మొదలై బంధువుల మధ్య పెద్ద ఘర్షణ గా మారింది.

New Update
 marriage

marriage

Fighting in wedding : పెళ్లిళ్ల సమయంలో చిన్న చిన్న విషయాలే పెద్ద ఘర్షణకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా ఆడపెళ్లివారు మగపెళ్లివారికి మర్యాద చేయలేదని, భోజనం సరిగా పెట్టలేదని, మాంసం వడ్డించలేదని ఇలాంటి చిన్న చిన్న విషయాలకే గొడవకు దిగుతారు. అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: Krishna Water Dispute: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల లొల్లి.. అసలేంటి వివాదం ?

ఉత్తరప్రదేశ్‌  రాష్ట్రంలోని గోవర్థన్‌పూర్‌ గ్రామంలో సబీర్ అనే వ్యక్తి తన కూతురు పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు చేశాడు. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. వరుడు, వధువు బంధువులు పెళ్లి వేడుకను వీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి వరకు భాగనే ఉన్నా  పెళ్లి భోజనం ఆలస్యమైందని వరుడి తరఫున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ...  70శాతం సక్సెస్ రేటు!

అప్పటికి వధువు ఇంటివారు వివాహ విందుకు ఘనంగానే ఏర్పాట్లు చేశారు. పెళ్లికి వచ్చిన వారికి ఏ మాత్రం తగ్గకుండా భోజనాలు వడ్డించేలా అన్నిరకాల పదార్థాలు రెడీ చేశారు. మందు, విందు ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. ఇంతలో వరుడి తరుపు బంధువులు కొందరు యువకులు తమకు వెంటనే భోజనం వడ్డించాలంటూ అమ్మాయి తరుపు వారిని కోరారు. అయితే వివాహ పనుల్లో ఉన్నా వధువు ఇంటివారు కొంత ఆలస్యం చేశారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకి నచ్చజెప్పేందుకు సబీర్‌ ప్రయత్నించాడు. కానీ వారు వినకపోగా.. గొడవ చేశారు. ఈ క్రమంలో చిన్న గొడవగా మొదలై వరుడు, వధువు తరపున బంధువుల మధ్య పెద్ద ఘర్షణ గా మారింది. అంతే పెళ్లి విషయం పక్కన పెట్టి రెండు కుటుంబాలు ఫైటింగ్ కు దిగాయి.

ఇది కూడా చదవండి: Kurnool Road Accident: APలో ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా నుంచి వస్తుండగా బస్సు బోల్తా: 45 మంది ప్రయాణికులు!

 ఒకరినొకరు కొట్టుకోవడంతో కూర్చీలు విసురుకోవడం, కనిపించిన వస్తువులన్నింటిని విసరడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారందరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: TTD: తప్పు చేశా క్షమించండి.. దిగొచ్చిన టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు