నెహ్రూకు ఎవరికి లెటర్స్ రాశారో తెలుసా.. వాటిలో ఏంముందో తెలిస్తే షాక్!

దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన చారిత్రక పత్రాలు, లేఖలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పత్రాలు ఏ ఒక్క కుటుంబానికో లేదా వ్యక్తికో చెందిన ప్రైవేటు ఆస్తి కాదని, ఇవి దేశ వారసత్వ సంపద అని స్పష్టం చేసింది.

New Update
nehru letters

దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన చారిత్రక పత్రాలు, లేఖలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పత్రాలు ఏ ఒక్క కుటుంబానికో లేదా వ్యక్తికో చెందిన ప్రైవేటు ఆస్తి కాదని, ఇవి దేశ వారసత్వ సంపద అని స్పష్టం చేసింది. 2008లో తీసుకున్న ఈ కీలక పత్రాలను వెంటనే ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని కేంద్ర సాంస్కృతిక శాఖ డిమాండ్ చేసింది. గతంలో కూడా ఈ లేఖలపై వివాదం చలరేగింది. వీటిలో ఎడ్వినా మౌంట్‌బాటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్ వంటి ప్రముఖులతో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నట్లు సమాచారం. అవి పర్సనల్ లెటర్స్ అయినా ఆయన ప్రధాని హోదాలో ఉండి వాటిని రాయడంతో అవి దేశభద్రత కోసం చాలా కీలకమని కేంద్రం అంటుంది.

జవహర్‌లాల్ నెహ్రూ రాసిన వ్యక్తిగత లేఖలు, కార్టూన్లు, ఇతర పత్రాలను 1971లో ఇందిరా గాంధీ అప్పటి 'నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ'కి భద్రత కోసం అప్పగించారు. అయితే, 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు సుమారు 51 పెట్టెలనిండా ఉన్న ఈ పత్రాలను ఆమె నివాసానికి తరలించినట్లు కేంద్రం తాజాగా పార్లమెంటులో వెల్లడించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయంపై స్పందిస్తూ, నెహ్రూ లేఖలు దేశ చరిత్రలో కీలకమైనవని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ స్వయంగా వీటిని మ్యూజియానికి ఇచ్చారని, ఒకసారి ప్రభుత్వ సంస్థకు దానం చేసిన పత్రాలను తిరిగి తీసుకోవడం చట్టవిరుద్ధమని కేంద్రం అంటోంది.

ఈ పత్రాలు పరిశోధకులకు, చరిత్రకారులకు అందుబాటులో ఉండాలని, కానీ ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయో, ఏ స్థితిలో ఉన్నాయో తెలియకుండా పోయిందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పార్లమెంటులో నెహ్రూ పత్రాలు "కనిపించడం లేదు" అనే వార్తలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం బదులిస్తూ.. ఆ పత్రాలు "మిస్సింగ్" కాలేదని, అవి సోనియా గాంధీ వద్దే ఉన్నాయని, వాటిని తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నామని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం 'ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ' (PMML)గా పేరు మార్చబడిన ఈ సంస్థ, ఇప్పటికే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఈ పత్రాలను అప్పగించాలని లేఖలు రాసింది. ఒకవేళ ఇవి తిరిగి రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు