Chennai: మెరీనా బీచ్‌లో తొక్కిసలాట.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య!

భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన ‘మెగా ఎయిర్‌ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను చూసేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. 100 మందికిపైగా గాయపడ్డారు.

New Update
airshow

తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌లో దారుణం జరిగింది. భారత వైమానిక దళం (IAF) ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్‌ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను వీక్షించేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. 

Also Read: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్‌!

100 మందికిపైగా గాయపడ్డారు. గాలి ఆడక 230 మంది సొమ్మసిల్లి పడిపోయారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. అలాగే మెరీనా బీచ్‌ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి ఎంఆర్‌టీఎస్‌ రైల్వేస్టేషన్‌లు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడంతో ప్లాట్‌ఫాంల్లో నిలబడేందుకు స్థలం లేకుండా పోయింది.

Also Read: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..!

Marina Beach

ఇక ఈ ఎయిర్‌ షోకు దాదాపు 10 లక్షలమంది హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో లు వైరల్ అవుతున్నాయి. 

Also Read: ఇజ్రాయెల్‌ లో ఉద్రిక్త పరిస్థితులు..విమానాలు రద్దు చేసిన ఇరాన్‌!

Also Read: ఊచకోతకు ఏడాది.. 365 రోజుల వినాశనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

Advertisment
Advertisment
తాజా కథనాలు