ఎయిరిండియాకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు బిగ్ షాక్!

ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో 82 ఏళ్ల వృద్ధురాలికి వీల్‌ఛైర్‌ సదుపాయం కల్పించలేదంటూ ఎయిరిండియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని, ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు.

New Update
ram mohan naidu

ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో 82 ఏళ్ల వృద్ధురాలికి వీల్‌ఛైర్‌ సదుపాయం కల్పించలేదంటూ ఎయిరిండియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని, ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు రాజ్యసభలో వెల్లడించారు.  రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీలకు సమాధానమిస్తూ, ఏవియేషన్ రెగ్యులేటర్ డిజిసిఎ ప్రయాణీకురాలి  కుటుంబంతో, ఎయిర్‌లైన్స్‌తో మాట్లాడిందని, సరిగ్గా ఏమి జరిగిందో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తోందని మంత్రి రామ్మోహన్‌ నాయుడు చెప్పారు.

82 ఏళ్ల వృద్ధ మహిళకు

ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వలన 82 ఏళ్ల వృద్ధురాలు, భారత సైనిక అధికారి భార్య ఆసుపత్రిపాలైంది. 2025 మార్చి 4వ తేదీన ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేందుకు 82 ఏళ్ల వృద్ధ మహిళకు ఆమె మనవరాలు విమాన టికెట్ తో పాటుగా వీల్‌చైర్‌ను కూడా బుక్ చేసింది. అయితే తీరా ఎయిర్ పోర్టుకు వెళ్లాక  ఎయిర్ ఇండియా సిబ్బంది ఆమెకు వీల్‌చైర్ ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసిన పట్టించుకోలేదు.  దీంతో చేసేదీ లేకా ఆ వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో  ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ కౌంటర్ ముందు వృద్ధురాలు పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి.  ఆమె పడిపోయినప్పటికీ ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెకు కనీసం ప్రధమ చికిత్స కూడా అందించలేదు.  దీంతో పరిస్థితి మరింత దిగజారడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

Also Read :  ఏపీలో ఉచిత కరెంట్.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే !

Advertisment
Advertisment
తాజా కథనాలు