Bihar Elections : బీజేపీ ఫస్ట్ లిస్టు రిలీజ్..9 మంది మహిళలకు చోటు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 71 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ తొలి జాబితాలో అత్యంత ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  సామ్రాట్ చౌదరి పోటీ చేసే స్థానం ఖరారైంది.

New Update
bjp

బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 71 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ తొలి జాబితాలో అత్యంత ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  సామ్రాట్ చౌదరి పోటీ చేసే స్థానం ఖరారైంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని పార్టీ తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. బీజేపీ తన తొలి జాబితాలో తొమ్మిది మంది మహిళలను బరిలోకి దింపింది. వీరిలో  రేణు దేవి, గాయత్రి దేవి, దేవంతి యాదవ్, రమా నిషాద్ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా,  ఇతర సీనియర్ నాయకులు హాజరైన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఈ జాబితాను విడుదల చేశారు.

9 మంది మహిళలకు టిక్కెట్లు 


1. బెట్టియా నుండి రేణు దేవి

2. పరిహార్ నుండి గాయత్రీ దేవి

3. నరపత్‌గంజ్ నుండి దేవంతి యాదవ్

4. కిషన్‌గంజ్ నుండి స్వీటీ సింగ్

5. ప్రాన్పూర్ నుండి నిషా సింగ్

6. కోధా నుండి కవితా దేవి

7. ఔరై నుండి రామ నిషాద్

8. వార్సలిగంజ్ నుండి అరుణా దేవి

9. జముయి నుండి శ్రేయసి సింగ్

243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి.  నవంబర్ 6 మొదటి దశ, నవంబర్ 11 రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.  ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్ ఎన్నికలకు జేడియూ, బీజేపీ రెండూ సీట్ల పంపకాలను ఖరారు చేశాయి. ఒప్పందం ప్రకారం, 243 సీట్లకు గానూ  బీజేపీ, జేడియూ చెరో 101 చోట్లలో పోటీ చేస్తుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో పోటీ చేస్తుంది. రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా (జితన్ రామ్ మాంఝీ)లకు ఒక్కొక్కరికి ఆరు సీట్లు కేటాయించారు. NDA కూటమిలో JD(U), LJP (రామ్ విలాస్), HAM (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు