BIG BREAKING: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై బాంబు దాడి

బీహార్ హాజీపుర్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, బాంబులతో దాడి చేశారు. బస్ డ్రైవర్ ని తొలగించారనే కోపంతో అతడే దాడికి పాల్పడి ఉంటాడని స్కూల్‌ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

New Update
bomb attack on delhi public school

bomb attack on delhi public school

Bomb Attack: బీహార్ రాష్ట్రం హాజీపూర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు బాంబులు, రాళ్లతో దాడి చేయడం కలకలం రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా .. స్కూల్ బయట ఉన్న సీసీటీవీలో ఫుటేజ్ ఆధారంగా దుండగులపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ  ఘటనలో స్కూల్ విద్యార్థులు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు...అందరూ క్షేమంగా ఉన్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో  అవి కాస్త వైరల్‌గా మారాయి.

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

డ్రైవర్ ను తొలగించడమే కారణమా? 

అయితే ఇటీవలే స్కూల్ యాజమాన్యం ఓ డ్రైవర్ ని విధుల నుంచి తొలగించారట. ఆ కోపంతో అతడే దాడికి పాల్పడి ఉంటాడని పాఠశాల సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు