Air India Flight Crash  : ప్రమాద స్థలాన్ని పరిశీలించిన  విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు

విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గుజరాత్ మంత్రులు, ఎయిర్‌పోర్ట్ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ప్రమాదంపై అధికారులతో చర్చించి మిగతా విషయాలు వెల్లడిస్తామన్నారు.

New Update
Ahmedabad Plane Crash visulas

Ahmedabad Plane Crash visulas

Air India Flight Crash  :  కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గుజరాత్ స్థానిక మంత్రులు, ఎయిర్‌పోర్ట్ అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. అమిత్ షా అక్కడికి రాగానే ప్రమాదంపై అధికారులతో మీటింగ్ నిర్వహించి మిగతా విషయాలు వెల్లడిస్తామన్నారు.

 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.. ప్రమాదం జరిగినప్పుడు నేను విజయవాడలో ఉన్నాను.. ప్రధాని మోడీ ఫోన్ చేసి ఘటనా స్థలానికి వెళ్లమన్నారు.. వెంటనే నేను ప్రమాద స్థలానికి చేరుకున్నా.. అమిత్ షా కూడా అహ్మదాబాద్‌ వస్తున్నారు.. అమిత్ షా వచ్చాక అధికారులతో మీటింగ్ ఉంది.. ఎంతమంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేను అని  రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశాడు.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ప్రయాణికుల మృతదేహాలను గుర్తించే పనిలో పడింది గుజరాత్ ప్రభుత్వం.  డీఎన్‌ఏ టెస్ట్ కోసం ప్రయాణికుల బంధువులు శాంపిల్స్ ఇవ్వాలని అధికారులు కోరారు.. ప్రమాద స్థలిలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.. సహాయక చర్యల్లో మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొంటున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు