/rtv/media/media_files/2025/05/07/wCQG4InwScJ8eI0jjPGj.jpg)
owisi-sindoor
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సైనిక దాడులను ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. మరో పహల్గామ్ పునరావృతం కాకుండా పాకిస్తాన్ కు కఠినమైన గుణపాఠం నేర్పించాలి.. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి. జై హింద్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి ఒవైసీ పాకిస్తాన్ను విమర్శిస్తూనే ఉన్నాడు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor
— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025
పహల్గామ్లో 26 మంది అమాయక టూరిస్టులను బలిగొన్న ఉగ్రవాద దాడి జరిగిన తరువాత భారత సాయుధ దళాలు బుధవారం (మే 7) 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన 90 మంది ఉగ్రవాదులు హతమమయ్యారు. పీవోకే క్యాంపుల్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి చేసింది.