కొన్ని రోజుల క్రితం వరుసగా ధ్రువ్ హెలికాఫ్టర్లు వరుస ప్రమాదాలకు గురైయ్యాయి. ఈ ఏడాది జనవరి 5న గుజరాత్ లోని పోరుబందర్ లో కోస్టు గార్డుకు చెందిన ధ్రువ్ కుప్పకూలిపోయింది. ఇందులో ఇద్దరు పైలట్లు మరణించారు. అంతకు ముందు కూడా ఓ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. ధ్రువ్ లో టెక్నాలజీ ప్రాబ్లెమ్స్ వల్లనే ఈ ప్రమాదాలు జరిగాయని తెలిసింది. అందుకే వాటిని తాత్కాలికంగా ఆపేశారు.
మళ్ళీ పరీక్షించి..ఓకే చేసి..
అయితే ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో శ్రీనగర్తోపాటు పరిసర ప్రాంతాలకు సైన్యాన్ని మోహరించేందుకు పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చారు. అక్కడే ధ్రువ్ హెలికాఫ్టర్లను కూడా మరోసారి పరీక్షించారు. ఆ తరువాత వాటిని పునరుద్ధరించవచ్చని ఢిఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ కమిటీ సిఫార్స్ చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లకు అనుమతినిచ్చింది.
ధ్రువ్ హెలికాష్టర్లను దేశీయంగా తయారు చేశారు. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఇది. ఇందులో రెండు ఇంజిన్లు ఉండే దీని బరువు 5.5 టన్నులు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, కోస్ట్గార్డుల్లో కలిపి మొత్తంగా 330 ఉన్నాయి. కేవలం ఇండియన్ ఆర్మీలోనే 150 హెలికాప్టర్లు సేవలందిస్తున్నట్లు సమాచారం.
today-latest-news-in-telugu | helicopters | Indian Army