BIG BREAKING: విమాన ప్రమాదంలో ఒక్కరూ మిగల్లేదు.. 242 మంది మృతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. అయితే ఈ దుర్ఘటనలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని కమిషనర్‌ జీఎస్‌ మాలిక్ స్పష్టం చేశారు. అలాగే విమానం కూలిన ప్రాంతంలోని పలువురు స్థానికులు కూడా చనిపోయి ఉంటారని పేర్కొన్నారు.

author-image
By B Aravind
New Update
All 242 people on board Air India flight killed

All 242 people on board Air India flight killed

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. ప్రమాదం జరిగే సమయంలో ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది సహా 242 మంది విమానంలో ఉన్నారు. అయితే ఈ దుర్ఘటనలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని కమిషనర్‌ జీఎస్‌ మాలిక్ స్పష్టం చేశారు. అలాగే విమానం కూలిన ప్రాంతంలోని పలువురు స్థానికులు కూడా చనిపోయి ఉంటారని పేర్కొన్నారు.మొత్తం ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉండగా, 53 మంది బ్రిటన్‌ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్‌ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి కూడా ఉన్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.

Also Read: ప్రమాదానికి ముందు MAYDAY..MAYDAY.. అంటూ సిగ్నల్ ఇచ్చిన పైలెట్.. దాని అర్థం ఏంటో తెలుసా?

అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ఎయిరిండియా ఫ్లైట్ మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరింది. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల టేక్ ఆఫ్ అయి కొద్దిదూరం వెళ్లాక కూలిపోయింది. దీంతో భారీ మంటలు, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌ భవనంపైనే ఈ విమానం కూలింది. ఈ ప్రమాదంలో హాస్టల్‌లోని 20 మంది వైద్య విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం.. భోజనం సమయం కావడంతో హాస్టల్‌లోనే చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. వారంతా మెస్‌లో భోజనాలు చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు