/rtv/media/media_files/2025/06/24/london-to-mumbai-air-india-flight-5-passengers-and-2-crew-members-feels-unwell-mid-air-2025-06-24-09-39-56.jpg)
air india flight emergency landing in mumbai
మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ముంబై నుండి చెన్నై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 639 క్యాబిన్లో ఏదో కాలిపోతున్నట్లు వాసన రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో ప్రయాణికులు సైతం భయంతో వణికిపోయారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
వెంటనే పైలట్ సమయస్ఫూర్తి ప్రదర్శించి.. ఆ విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో ఉన్న ప్రయాణీకులను మరొక విమానంలో కూర్చోబెట్టారు. దీని తర్వాత విమానం చెన్నైకి బయలుదేరింది.
The crew of flight AI639 operating from Mumbai to Chennai yesterday, made a precautionary air return to Mumbai due to a burning smell in the cabin.
— ANI (@ANI) June 28, 2025
Air India Spokesperson says "The flight landed safely back in Mumbai, and an aircraft change was initiated. Our ground colleagues…
ఎయిర్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. శుక్రవారం ముంబై నుండి చెన్నై వెళ్తున్న విమానం కాక్పిట్ నుండి అకస్మాత్తుగా మండుతున్న వాసన వచ్చిందని తెలిపారు. తరువాత విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అనంతరం తమ బృందం ప్రయాణికులను కిందికి దించి వేరొక విమానం ఎక్కించారని తెలిపారు. ఈ సమయంలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
అహ్మదాబాద్ ప్రమాదం
జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కేవలం 2 నిమిషాలకే ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 275 మంది మరణించారు. ఇందులో సిబ్బందితో సహా విమానంలో ఉన్న 241 మంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో కేవలం ఒక యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మరణించారు.