Gold Smuggling Case: నటి రన్యారావుకు మూడోసారి నిరాశే.

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ బ్యూటీ రన్యారావుకు మూడోసారి నిరాశ తప్పలేదు. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్ కోర్టు గురువారం తిరస్కరించింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

New Update
   Gold Smuggling Case

Gold Smuggling Case

Gold Smuggling Case: బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ బ్యూటీ రన్యారావుకు మూడోసారి నిరాశ తప్పలేదు. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్ కోర్టు గురువారం తిరస్కరించింది. దుబాయ్ నుంచి అక్రమంగా 14 కిలోల బంగారం తీసుకొస్తూ మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రయంలో  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. మొత్తం 12.56 కోట్ల విలువైన 14 కిలోల బంగారం ఆమె దగ్గర నుంచి డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు లోతుగా సాగుతున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ ఆమె దుబాయ్‌ నుంచి పెద్ద ఎత్తున బంగారం అక్రమ రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు.

Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?

విదేశాల్లో బంగారం కొనుగోలుకు హవాలా సొమ్మును వినియోగించినట్లు స్వయంగా రన్యారావు అంగీకరించారని డీఆర్‌ఐ తరఫు న్యాయవాది మధురావు కోర్టుకు తెలియజేశారు. ఇరువురూ కలిసి 26సార్లు దుబాయ్ వెళ్లారని, ఉదయం వెళ్లి, సాయంత్రానికి వచ్చేసేవారని తెలిపారు. రన్యారావుకు బెయిలు ఇవ్వకూడదని ఆయన వాదనలు వినిపించారు. మంగళవారం ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేసి.. మార్చి 27కు వాయిదా వేశారు. తాజాగా, గురువారం తీర్పును వెలువరించిన సెషన్స్ కోర్టు.. బెయిల్‌ను తిరస్కరించింది. ఆమెపై ఉన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, తక్షణమే బెయిలు ఇవ్వడం కుదరదని చెప్పింది. అయితే,రన్యారావును ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని ఆమె తరపు న్యాయవాది కిరణ్‌ జవళి ఆరోపించారు.

Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

ఈ కేసులో మరో నిందితుడు నటుడు తరుణ్ రాజ్ బెయిల్ పిటిషన్‌పై కూడా కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. రన్యా రావు పంపిన డబ్బుతోనే తరుణ్ రాజ్.. దుబాయ్‌ నుంచి బ్యాంకాక్, జెనీవాకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవాడని డీఆర్ఐ ఆరోపించింది. హోటల్‌ వ్యాపారి తరుణ్‌రాజ్, రన్యారావు మిత్రులని... వీరిద్దరూ 2023లో దుబాయ్‌లో విరా డైమండ్స్‌ ట్రేడింగ్‌ అనే పేరుతో కంపెనీని స్థాపించినట్టు కోర్టు తెలిపారు. అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని సాహిల్ జైన్ అనే వ్యాపారి ద్వారా విక్రయించినట్టు గుర్తించారు. సాహిల్‌‌ను డీఆర్ఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు.  బంగారం అక్రమ రవాణా కేసులో ఇప్పటివరకు ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్టయ్యింది.

Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు