/rtv/media/media_files/2025/06/25/operation-sindhu-1-2025-06-25-11-54-44.jpg)
ఆపరేషన్ సింధులో భాగంగా ఇప్పటి వరకూ ఇరాన్ నుంచి 2,858 మందిని స్వదేశానికి తీసుకొచ్చామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్లో పోస్టు పెట్టింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ సింధు చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారజామున ఇరాన్ నుంచి భారతీయులతో బయల్దేరిన ప్రత్యేక విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇందులో 282 మంది భారతీయులు క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఇరాన్ నుంచి వచ్చిన 11వ విమానం ఇదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇందులో పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంకకు చెందిన వారు కూడా ఉన్నారు.
#OperationSindhu
— Randhir Jaiswal (@MEAIndia) June 24, 2025
282 Indian nationals were evacuated from Iran on a special flight that arrived in New Delhi from Mashhad at 00:01 hrs on 25th June.
With this, 2858 Indian nationals have been brought home from Iran. pic.twitter.com/Mgl84eBxQW
మరోవైపు ఇజ్రాయెల్ నుంచి 3 విమానాల్లో దాదాపు 594 మంది భారత పౌరులు, నేపాల్, శ్రీలంక పౌరులను సురక్షితంగా తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్, ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన దాదాపు 3180 మంది భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినట్లు వివరించింది.