Nara Lokesh:టీడీపీ సమావేశంలో కంటతడి పెట్టిన నారా లోకేశ్

చంద్రబాబు ప్రజల మనిషని, ఎల్లప్పుడూ జనాల కోసమే పని చేశారని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈరోజు జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో తన తండ్రి గురించి చెబుతూ లోకేశ్ కంటతడి పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం, నేతలు తనను, తన తల్లిని, భార్యను రోడ్డున పడేశారని మండిపడ్డారు.

AP Mega DSC : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే!
New Update

టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. జగన్ మీద, వైసీపీ నేతల మీద మండిపడ్డారు. భువనేశ్వరి, బ్రాహ్మణి కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ వైసీపీ మంత్రులు చేసిన విమర్శలపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట... భోజనంలో విషం కలపడం, బాబాయిని చంపేయడం వంటివి జగన్ డీఎన్ఏ అంటూ లోకేశ్ మండిపడ్డారు.

2019లో ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు జగన్ ను సీఎంగా చేశారని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ నియంతలా వ్యవహరించారని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిందని ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా కష్టపడి తెచ్చిన పరిశ్రమలను జగన్, వైసీపీ నేతలు రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:పదేళ్ళ అనుబంధానికి ముగింపు పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ

టీడీపీ - జనసేన కలిస్తే వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలుపు ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారని, డబ్బే సంపాదించాలని అనుకుంటే ఆయనకు రాజకీయాలే అవసరం లేదన్నారు. ఉద్యోగాలు కల్పించినందుకు, సంక్షేమం అమలు చేసినందుకు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరినందుకు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అడిగినందుకు ఆయన్ను జైల్లో పెట్టారా.? అని లోకేశ్ నిలదీశారు.రాష్ట్రానికి చంద్రబాబు బోలెడు పరిశ్రమలు తీసుకొచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అహర్నిశలు ప్రజల కోసమే పరితపించారు. పేదవారి అభివృద్ధి కోసమే కష్టపడ్డారు. అంటూ లోకేశ్ కంటతడిపెట్టుకున్నారు.

#nara-lokesh #chandrababu #tdp #meeting
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe