నారా లోకేశ్, అయ్యన్న పాత్రుడికి క్యారెక్టర్ లేదు.... డిప్యూటీ సీఎం ఫైర్...!

టీడీపీపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అల్ల కల్లోలం సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. చివరకు పోలీసులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేశారని మండిడపడ్డారు. టీడీపీ నేతలంతా మానవత్వం లేని మనుషులు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేశ్ కు, అయ్యన్న పాత్రుడికి అసలు క్యారెక్టర్ లేదంటూ మండిపడ్డారు.

New Update
నారా లోకేశ్, అయ్యన్న పాత్రుడికి క్యారెక్టర్ లేదు.... డిప్యూటీ సీఎం ఫైర్...!

టీడీపీపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అల్ల కల్లోలం సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. చివరకు పోలీసులపై కూడా టీడీపీ నేతలు దాడులు చేశారని మండిడపడ్డారు. టీడీపీ నేతలంతా మానవత్వం లేని మనుషులు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేశ్ కు, అయ్యన్న పాత్రుడికి అసలు క్యారెక్టర్ లేదంటూ మండిపడ్డారు.

ప్రజలకు మంచి చేస్తామమని టీడీపీ నేతలు చెప్పడం లేదని చెప్పారు. పిచ్చి కుక్కల మాదిరిగా రోడ్లపై తిరుగుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు ఏ మాత్రమూ లేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే వెన్ను పోటు దారుడు అని గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. పుంగనూరు ఘటనలో చంద్రబాబు మొదటి ముద్దాయని ఆరోపించారు.

రౌడీ రాజ్యం తేవాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ఆరోపణు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడిన ప్రతిసారి తమ్ముళ్లు తామే అధికారంలోకి వస్తున్నామని అంటున్నాడని వెల్లడించారు. ఏ ఊరికి వెళ్ళినా సీఎం జగనన్న సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చాలా సహనంతో ఉన్నారని తెలిపారు. మొన్న పుంగనూరు లో జరిగిన ఘటనపై కోర్టులు సుమోటోగా స్వీకరించాలన్నారు. నిన్న కూడా టీడీపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ లు పాదయాత్రలు చేస్తూ చంపుతాం, అంతు చూస్తామంటూ ప్రజలను రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు చేయడం రౌడీ రాజకీయాలను ప్రేరేపించడమేనన్నారు.

Advertisment
తాజా కథనాలు