Nalgonda: నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి కన్నుమూత

నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

Nalgonda: నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి కన్నుమూత
New Update

నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దామోదర్ రెడ్డికి భార్య సులోచన, కొడుకు సుభాష్‌చంద్రారెడ్డి, కుమార్తె ఝాన్సీలక్ష్మీ ఉన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లా పీఏపల్లికి మండలం అజ్మాపురానికి చెందిన దామోదర్‌ రెడ్డి.. 1980లో నల్గొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

Also Read: హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఆందోళనలో అసదుద్దీన్?

ఆ తర్వాత 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి రఘురామరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దామోదర్ రెడ్డి మృతికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, కొండమల్లెపల్లి సింగిల్‌విండో ఛైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు.

Also Read: కలకలం రేపుతున్న ముంబయి హోర్టింగ్ ప్రమాదం.. 14 మంది మృతి..

#telugu-news #telangana-news #nalgonda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి