Jagittala: కోరుట్ల దీప్తి కేసులో మరో ట్విస్ట్.. చెల్లెలి ఆడియో కలకలం

దీప్తి మృతి కేసులో వీడని మిస్టరీ. దీప్తి మృతితో నాకు సంబంధం లేదని చెల్లెలి ఆడియో కలకలం రేపుతోంది. నేను మా ఫ్రెండ్‌కు చెప్పి మద్యం తెప్పించాను. ఎవరో బాయ్ ఫ్రెండ్‌ ఆక్కకు ఫోన్ చేశాడని తమ్ముడికి వివరించింది చందన. తనకు బయట ఎక్కడా డబ్బులు లేవని.. అందుకే డబ్బులు తీసుకున్నట్టు ఒప్పుకుంటానన్న చందు ఆడియో వైరల్ గా మారింది.

New Update
Jagittala: కోరుట్ల దీప్తి కేసులో మరో ట్విస్ట్.. చెల్లెలి ఆడియో కలకలం

దీప్తి ఒంటిపై గాయాలు..

జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బ ప్రాంతంలో మరణించిన దీప్తి కేసులో మిస్టరీ వీడలేదు. కీలకంగా భావిస్తున్న చెల్లెలు చందన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీప్తి మృతితో తనకు సంబంధం లేదన్న చెల్లెలి ఆడియో కలకలం రేపుతోంది. ఎవరో బాయ్ ఫ్రెండ్ ఆక్కకు ఫోన్ చేశాడని తమ్ముడికి చందన వివరించింది. డబ్బులు, బంగారం మాయం కావటం.. దీప్తి ఒంటిపై గాయాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. అనుమానస్పదంగా మృతి చెందినా.. దీప్తి ఒంటిపై స్వల్పగాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు సమాచారం. అంతేకాకుండా దీప్తి టీషర్ట్ కింద శరీరం కాస్త కమిలిన గాయాలు, చెంపపై గీసుకుపోయినట్లుగా ఓ చిన్న గాయం ఉన్నట్లు తెలిసింది. దీంతోపాటు దీప్తి చేతులు కట్టేసినట్లుగా మణికట్టు వద్ద గాయం ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ చేయి విరిగి ఉంటే పక్కాగా దీప్తి హత్యకు గురైందన్న అంశానికి మరింత బలం చేకూరేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చందన పోలీసుల అదుపులో ఉన్నట్లు ఊహాగానాలపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

దీప్తిది హత్యా? ఆత్మహత్యా?

కీలకంగా భావిస్తున్న చెల్లెలు చందన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చందన.. తమ్ముడు సాయికి పంపినట్టుగా భావిస్తున్న ఓ ఆడియోలో సాయి.. "నేను చందు అక్కను’.. అసలు నిజం ఏంటంటే..? దీప్తి అక్క, నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాం..!! కానీ.. నేను తాగలేదు.. అక్కనే తాగింది. నేను ‘మా ఫ్రెండ్‌ చేత రెండు మందు బాటిళ్లు’ తెప్పించినట్లు నేను ఒప్పుకుంటా.. కానీ నేను తాగలేదని చందు చెప్పింది. అక్క తాగి తన బాయ్‌ ఫ్రెండ్‌ను పిలుస్తా అంటే నేను ఒప్పు కోలేదు. అయినా పిలుస్తాను అనడంతో ఒప్పుకున్నా అని చందు ఫోన్‌లో సాయికి వివరించింది. ఇంట్లోంచి నేను వెళ్లిపోవాలని అనుకున్నది నిజమే కానీ అక్కకు చెప్పి వెళ్లిపోదాం అనుకున్నా. ‘మీరు అందరూ నన్ను వెయిట్‌ ఉన్నావని అంటుంటే బయటకు వెళ్లి ఒంటరిగా ఉండాలని అనుకున్నా.. నాకు బయట ఎక్కడా డబ్బులు లేవు అందుకే డబ్బులు తీసుకున్నా" అని ఉంది.

నేను బ్రీజర్‌ తాగాను..:
"నేను అక్కను ఏమీ చేయలేదే డాడీ’.. ప్లీజే..నమ్మండి నన్ను. అక్క తాగుదాం అంటేనే నా ఫ్రెండ్‌కు చెప్పి రెండు బాటిల్స్‌ తెప్పించాను. నేను బ్రీజర్‌ తాగాను. అక్క ఓడ్కా తాగింది. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు" అంటూ ప్రాధేయపడుతూ తమ్ముడికి పంపినట్టుగా ఉన్న వాయిస్‌ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాఫిక్‌గా మారింది. దీప్తి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు వివరాలను సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఉందని, దీప్తిది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం పూర్తి విచారణ తర్వాత తెలుస్తుందని సీఐ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

వాట్సాప్ స్టేటస్ చూసి రెచ్చిపోయాడు..  19 ఏళ్ల అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడు

తమిళనాడలోని పొల్లాచిలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి స్టేటస్ చూసి తట్టుకోలేక ఓ యువకుడు ఆమెను దారుణంగా చంపేశాడు.  హత్యకు గురైన అమ్మాయిని  అశ్విక (19)గా గుర్తించారు. పొల్లాచ్చిలోని అన్నామలై నగర్‌కు చెందిన ఆర్ ప్రవీణ్‌కుమార్ (25) ఆమెను హత్య చేశాడు.

New Update
tamil-nadu-murder

తమిళనాడలోని పొల్లాచిలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి స్టేటస్ చూసి తట్టుకోలేక ఓ యువకుడు ఆమెను దారుణంగా చంపేశాడు.  హత్యకు గురైన అమ్మాయిని  అశ్విక (19)గా గుర్తించారు. ఆమె మలుమిచ్చంపాటిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో  బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతోంది. పొల్లాచ్చిలోని అన్నామలై నగర్‌కు చెందిన ఆర్ ప్రవీణ్‌కుమార్ (25) ఆమెను హత్య చేశాడు, అతను పొల్లాచ్చిలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. 

రెండు సంవత్సరాల క్రితం అశ్విక, ప్రవీణ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా చదువు అయిపోయాక ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే  అశ్విక తన కాలేజీ స్నేహితులతో తీసుకున్న ఫోటోలను తన వాట్సాప్ స్టేటస్‌గా ఉంచుకునేది . ప్రవీణ్‌కుమార్ కాలేజీలోని మగ విద్యార్థుల ఫోటోలను వాట్సాప్ స్టేటస్‌గా ఉంచవద్దని ఆమెకు పలుమార్లు చెప్పాడు. ఇదే విషయంపై అమ్మాయి తల్లిదండ్రులకు కూడా చెప్పాడు.  ఇప్పుడే ఇంత అనుమానిస్తున్నాడని వెంటనే ప్రవీణ్ సంబధాన్ని అశ్విక తల్లిదండ్రులు క్యాన్సిల్ చేసుకున్నారు.  రెండు నెలల క్రితం ఆ సంబంధం తెగిపోయింది. 

ఇద్దరు అబ్బాయిలతో ఫోటో

తాజాగా మరోసారి అశ్విక తన వాట్సాప్ స్టేటస్ లో ఇద్దరు అబ్బాయిలతో కూడిన  ఓ ఫోటోను పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న ప్రవీణ్..  అశ్విక ఒంటరిగా ఉన్న టైమ్ లో ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు.  ఆమె మెడపై కత్లితో మూడు సార్లు దాడి చేశాడు.  వెంటనే అక్కడి నుంచి పారిపోయి పొల్లాచ్చి వెస్ట్ పోలీసుల ముందు లొంగిపోయాడు. అమ్మాయి తండ్రి కన్నన్ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి రాగా..  తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న తన కుమార్తెను పొల్లాచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Also read :   Rajasthan : ఏం మనిషివిరా..  తినేది ఇండియా సొమ్ము..పాకిస్తాన్కు గూఢచర్యం

Advertisment
Advertisment