మంకీపాక్స్..! ఈ పేరు వింటేనే ప్రజలు గజగజా వణికిపోతున్నారు.. కరోనా కంటే యమ డేంజరస్ డిసీజ్ ఇది.. సోకితే అంతే సంగతి..! అసలు మంకీపాక్స్కు సంబంధించిన ఫొటోలను చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. మొన్నిటివరకు ఆఫ్రికాను టెన్షన్ పెట్టిన మంకీపాక్స్ ఇప్పుడు ఏషియా దేశాల్లోని ప్రజలను భయపెడుతోంది. ఎందుకంటే పాకిస్థాన్లో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మంకీపాక్స్ కేసు నమోదవడంతో జమ్ము ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు ఫిలిప్పీన్స్లోనూ కేసులు రికార్డవడంతో ఇండియా అప్రమత్తమైంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న Mpox కేసుల దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అప్రమత్తంగా ఉండాలని ఎయిర్పోర్టు, సీ పోర్టు అధికారులను ఆదేశించింది. మంకీపాక్స్ ముప్పును ఎదుర్కొనేందుకు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డుల ఏర్పాటుతో పాటు విమానాశ్రయాల్లో అలెర్ట్ ప్రకటించింది కేంద్రం. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని ప్రభుత్వం ఆస్పత్రులకు ఆర్డర్ పాస్ చేసింది.
పూర్తిగా చదవండి..Mpox: భయపెడుతున్న మంకీపాక్స్.. కేంద్రం కీలక ఆదేశాలు
ప్రస్తుతం ఎంపాక్స్ (Mpox) వైరస్ కలకలం రేపుతోంది. మొన్నటివరకు ఆఫ్రికాను టెన్షన్ పెట్టిన ఈ వైరస్ ఇప్పుడు ఇతర దేశాల ప్రజలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని కేంద్రం ప్రభుత్వం.. ఆస్పత్రులను ఆదేశించింది.
Translate this News: