విజయవాడలో దారుణం.. కూతురు ప్రేమకి.. తల్లి బలి!!

విజయవాడలోని భవానీపురంలో లలిత అనే మహిళ తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. తనకు ఒక్కగానొక్క కూతుర్ని ఎంతో అల్లారు ముద్దగా పెంచుతూ.. తన కాళ్ల మీద తాను నిలబడేలా ఎంబీఏ వరకూ చదివించారు. దీంతో ఆమెకి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పేరెంట్స్ కి చెప్పింది. పేరెంట్స్ కూడా తన ప్రేమని ఒప్పుకోవడం లేదని.. ప్రేమించిన అబ్బాయితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది యువతి. దీంతో తల్లి లలిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

విజయవాడలో దారుణం.. కూతురు ప్రేమకి.. తల్లి బలి!!
New Update

పిల్లలే తమ సర్వస్వమని బతుకుతూంటారు తల్లిదండ్రులు. వారి కోసం ఎంతకష్టమైన పడతారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో ప్లాన్ చేస్తూంటారు. వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూరుస్తూంటారు. అందులోనూ వారి పెళ్లి అలా చేయాలి.. ఇలా చేయాలని కలలు కనని పేరెంట్స్ ఉండరు. కట్ చేస్తే.. ఇటు పిల్లలేమో ప్రేమ అంటూ దాని వెంటపడి.. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూంటారు. ప్రేమ మోజులో పడి అమ్మాయిలు ఇళ్లు వదిలి వెళ్లిపోతే.. తల్లిదండ్రులు మనసు ఎంత క్షోభకు గురవుతుంది? వారి బాధ వర్ణణాతీతమనే చెప్పాలి. కొందరైతే దీన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ తల్లి కూడా కూతురి ప్రేమ కారణంగా తనువు చాలించింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని భవానీపురంలో లలిత అనే మహిళ తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. తనకు ఒక్కగానొక్క కూతుర్ని ఎంతో అల్లారు ముద్దగా పెంచుతూ.. తన కాళ్ల మీద తాను నిలబడేలా ఎంబీఏ వరకూ చదివించారు. దీంతో ఆమెకి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి స్థానం సంపాదించుకుంది. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేదు. తమ కూతురు హైదరాబాద్ వెళ్లి జాబ్ చేస్తుంది అని ఆనందపడ్డారు. ఇక ఆ తర్వాత కూతురికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామనుకున్నారు.

కట్ చేస్తే.. తల్లిదండ్రులకు వారికి షాక్ ఇచ్చింది కూతురు. తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని కుండబద్దలయ్యే విషయం చెప్పింది. ఆరు నెలల క్రితం తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పేరెంట్స్ కి చెప్పింది. ఇక అప్పటి నుంచి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎంత చెప్పినా తమ కూతురు మాట వినలేదు. అతడ్నే చేసుకుంటానని మొండికేసింది.

అటు పేరెంట్స్ కూడా తన ప్రేమని ఒప్పుకోవడం లేదని.. ప్రేమించిన అబ్బాయితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది యువతి. దీంతో తమ పరువు పోయిందని తల్లి లలిత తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆ బాధలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. లలిత మరణంతో.. భర్త, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

#vijayawada #mother-commits-suicide #crime-news #daughters-love #suicide #crime
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe