Telangana: మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తల్లి, కుమారుడు దారుణ హత్య..

మహబూబాబాద్ జిల్లాలో.. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తల్లి, కుమారుడ్ని దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండల కేంద్రంలో కుమారస్వామి అనే వ్యక్తి.. ఆ తల్లి, కుమారుడ్ని ఇనుపరాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు.

New Update
Telangana: మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తల్లి, కుమారుడు దారుణ హత్య..

మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తల్లి, కుమారుడ్ని దారుణంగా హత్య చేశారు. ఈ విషాదకర ఘటన గూడూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కుమారస్వామి అనే వ్యక్తి.. ఆ తల్లి, కుమారుడ్ని ఇనుపరాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. అయితే ఇరు కుటుంబాల మధ్య గత ఏడేళ్లుగా తగాదాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

Also Read: భర్త ఆత్మహత్యాయత్నాం.. పేరుకే పోలీస్, వాడో రౌడీ అంటోన్న భర్య..!

ఈ ఘటన జరిగిన అనంతరం నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు బొల్లేపల్లి గ్రామానికి చెందిన సమ్మక్క.. కుమారుడు సమ్మయ్యలుగా గుర్తించారు.

Also Read: డిప్రెషన్‌తో బాధపడ్డ రచనారెడ్డి..? మెడికో మృతిపై ఎన్నో అనుమానాలు!

Advertisment
తాజా కథనాలు