IMD: జూన్‌ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు!

నైరుతి రుతుపవనాలు జూన్‌ 5 నుంచి 11 మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల గమనం సానుకూలంగా ఉందని అధికారులు వివరించారు. మే నెలాఖరుకే రుతుపవనాలు కేరళను తాకేందుకు రెడీగా ఉన్నాయి.

IMD: జూన్‌ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు!
New Update

Monsoon for Telangana: నైరుతి రుతుపవనాలు జూన్‌ 5 నుంచి 11 మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నట్లు వాతావరణశాఖాధికారులు (IMD) తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల గమనం సానుకూలంగా ఉందని అధికారులు వివరించారు. మే నెలాఖరుకే రుతుపవనాలు కేరళను తాకేందుకు రెడీగా ఉన్నాయి.

కేరళ (Kerala) నుంచి ఏపీలోని రాయలసీమ మీదగా తెలంగాణను (Telangana) చేరుకోవడానికి సుమారు వారం రోజులు వ్యవధి పడుతుందని అధికారులు వివరించారు. అంటే జూన్ 5 నుంచి 8 తేదీల మధ్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయి.

గత సంవత్సరం కేరళకే జూన్‌ 11 న రుతుపవనాలు తాకాయి. ఈ ఏడాది తెలంగాణకే జూన్ 5 కల్లా రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. తెలంగాణకు గతేడాది జూన్‌ 20కి కానీ రుతుపవనాలు ఎంటర్ అవ్వలేదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాకతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Also read: దేశాధ్యక్షుడు చనిపోతే బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్న దేశస్థులు!

#monsoon #telangana #imd #rain-alert
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe