PM Modi : చంద్రబాబుకు మోడీ ఫోన్.. కూటమి విజయంపై ప్రశంసలు!

ఏపీలో స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతున్న టీడీపీ కూటమి విజయం దాదాపు ఖరారైంది. ప్రధాని మోడీ.. చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులపై ప్రశంసలు కురిపించారు. టీడీపీ 133, వైసీపీ 15, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Chandra Babu Naidu: రేపు ఢిల్లీకి చంద్రబాబు!
New Update

2024 Elections : ఏపీ (AP) లో స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతున్న టీడీపీ కూటమి (TDP Alliance) విజయం దాదాపు ఖరారైంది. చంద్రబాబు, పవన్, బీజేపీ (BJP) నాయకులపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ (PM Modi) చంద్రబాబు (Chandrababu) కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఏపీలో కూటమి విజయం పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకున్న టీడీపీ మద్ధతు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకం కానుంది. ఇదిలావుంటే.. ఇప్పటికే గెలుపు సంబరాల్లో మునిగితేలుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రాత్రికి అమరావతిలో చంద్రబాబుతో భేటీ కానున్నట్లు సమాచారం.

Also Read : నంద్యాలలో కనిపించని అల్లు అర్జున్ క్రేజ్..!

#andhra-pradesh #chandrababu #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe