MMTS Trains: నగరవాసులకు శుభవార్త...రూ. 5టిక్కెట్ తో 22కి.మీల హైస్పీడ్ జర్నీ..!!

సనత్ నగర్ మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైన్ పూర్తయ్యింది. సనత్ నగర్ , మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. 22కిలోమీటర్ల మేర 6 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.5 టిక్కెట్ తో హైస్పీడ్ జర్నీ అందుబాటులోకి రానుంది.

New Update
Hyderabad: నగర వాసులకు అలర్ట్‌..ఈ రూట్లలో రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

MMTS Trains: హైదరాబాద్ నగరవాసులకు మెట్రో కంటే ముందు నుంచి ఎంఎంటీఎస్ సేవలు అందిస్తుంది. మెట్రోలు అందుబాటులోకి వచ్చినా..ఎంఎంటీఎస్ జర్నీకి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. మెట్రోలేని ప్రాంతాల్లో ఎంఎంటీఎస్ లు ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. పైగా మెట్రోతో పోలిస్తే..వీటి ఛార్జీలు కూడా చాలా తక్కువే. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు..ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు,కూలీలు ఇలా చాలా మంది నిత్యం ఎంఎంటీఎస్ లలో ప్రయాణిస్తుంటారు. అయితే ఈ రైళ్లు ఎక్కువగా లేవు. ఈక్రమంలో తాజాగా రక్షణ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సనత్ నగర్, మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైను కూడా పూర్తయ్యింది. రక్షణశాఖ రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి. రెండో దశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం వంటి పనులు పూర్తి చేశారు. వచ్చేనెల అంటే మార్చిలోనే ఈ లైన్ ప్రారంభం కానుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి గాను మార్చి మొదటివారంలో హైదరాబాద్ వస్తున్నారు. అదే రోజు సనత్ నగర్ మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్లను కూడా మోదీ ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ ఘట్ కేసర్ లైన్ కూడా అదేరోజు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. చర్లపల్లి స్టేషన్ ప్రారంభం అయ్యాక..అక్కడి నుంచి 25 ప్యాసింజర్ రైళ్లు దూరప్రాంతాలకు రాకపోకలను సాగించనున్నాయి. ఈ ట్రైన్లకు ప్రయాణికులను చేరవేయాలన్నా ఆయా స్టేషన్లలో దిగినవారిని నగరానికి తీసుకురావాలన్నా ఎంఎంటీఎస్ లు కీలకం. సనత్ నగర్ మౌలాలి లైనుతోనే ఇది సాధ్యం అవుతుందని రైల్వే అధికారులు అంటున్నారు.

ఎంఎంటీఎస్ రెండో దశ మౌలాలి సనత్ నగర్, హైటెక్ సిటీ మీదుగా లింగంపల్లి లైన్ అందుబాటులోకి రానుంది. దీంతో ఈ రూట్లలో ప్రయాణాలు సాగించే ఐటీ ఉద్యోగులు త్వరగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. అత్యంత రద్దీగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా మౌలాలి నుంచి హైటెక్ సిటీకి ఎంఎంటీఎస్ లు అందుబాటులోకి వస్తాయి. మౌలాలి సనత్ నగర్ మధ్య మొత్తం 22 కి.మీ. మేర ఆరు స్టేషన్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వీటి పరిధిలో ఉన్న కాలనీలు బస్తీలకు కేవలం రూ. 5 టిక్కెట్ తో హైస్పీడ్ ప్రయాణం అందుబాటులోకి రానుంది.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన 17 మంది కౌన్సిలర్లు..!!

Advertisment
తాజా కథనాలు