Liquor Scam Case : ఎమ్మెల్సీ కవిత సీబీఐ ఛార్జిషీట్‌పై విచారణ వాయిదా

లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేజీలు సరిగ్గా లేవని నిందితుల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది కోర్టు.

MLC Kavitha: కవిత ఎక్కడికీ పారిపోరు.. సిసోడియా బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయి: ముకుల్ రోహత్గీ
New Update

MLC Kavitha Charge Sheet Enquiry Adjourned : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case) లో దాఖలైన తుది ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ ఛార్జిషీట్ స్క్రూట్నీ చేయాల్సి ఉందని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్‌లో పేపర్లకు ఒక వైపు మాత్రమే పేజ్ నంబర్ ఉందని వాదనలు వినిపించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని కోర్టుకు చెప్పారు. ఈనెల 14 వరకు పేజీనేషన్ సరిచేసి ఇస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 21 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు. కాగా సీబీఐ నమోదు చేసిన ఛార్జిషీట్ లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను ఏ17గా చేర్చారు. ఆమెతో సహా మిగత నిందితులను వర్చువల్ గా కోర్టులో హాజరుపర్చారు అధికారులు.

Also Read : భారత్‌కు మరో పతకం..రజతాన్ని కొట్టిన బల్లెం వీరుడు

#mlc-kavitha #rouse-avenue-court #liquor-scam-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe