జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని మోరంచపల్లి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. మోరంచపల్లిలో మొరంచ వాగు ధాటికి గ్రామం అల్లకల్లోలమైంది. దీంతో ఊరిని మొత్తం వరద చుట్టుముట్టింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఇండ్లు మొత్తం నీటమునిగాయి. ఇండ్లపైకి చేరుకున్న గ్రామప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తెల్లవార్లు గడిపారు. గ్రామ శివారులోకి వరద వచ్చి చేరడంతో ఇళ్లన్ని నీట మునిగాయి. వెంటనే రంగంలోకి దిగిన సహాయిక బృందాలు గ్రామస్తులను రక్షించేందుకు హెలికాప్టర్లు, బోట్లతో ఎంట్రీ ఇచ్చారు. అందరినీ సురక్షితంగా కాపాడారు.
పూర్తిగా చదవండి..Moranchapalli: మోరంచపల్లిలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర
శుక్రవారం మోరంచపల్లిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి (MLA Gandra Venkata Ramana reddy), జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి (Gandra Jyothi) పర్యటించారు. ఇంటింటికి తిరిగి బాధితులను పరామర్శించారు. బాధితుల క్షేమసమాచారాలు అడిగితెలుసుకున్నారు. పలువురు వరద ఉధృతిని గురించి గండ్ర దంపతులకు వివరించారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు...
Translate this News: