Telangana: రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసా అమలు ఎప్పుడంటే..

వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకున్న కౌలుదార్లకు రైతు భరోసా సాయం అందుతుందని స్ప,ష్టం చేశారు.

New Update
Telangana: రైతులకు గుడ్‌న్యూస్.. రైతు భరోసా అమలు ఎప్పుడంటే..

Telangana Rythu Bharosa:  వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. అయితే రైతుల నుంచి అఫిడవిట్ తీసుకున్న కౌలుదార్లకు మాత్రమే రైతు భరోసా సాయం అందుతుందని చెప్పారు. అలాగే ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Also Read: విద్యార్థులకు అలర్ట్‌.. పాఠశాలల సమయాల్లో మార్పులు

Advertisment
తాజా కథనాలు