Minister Peddi Reddy: సీఎం జగన్ దాడిలో లోకేష్ పాత్ర.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడిపై లోకేష్ చేసిన ట్వీట్ పలు అనుమానాలకు దారి తీస్తోందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇది ముమ్మాటికి టీడీపీ చేసిన దాడే అని ఆరోపించారు. సీఎం జగన్ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.

Minister Peddi Reddy: సీఎం జగన్ దాడిలో లోకేష్ పాత్ర.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
New Update

Minister Peddi Reddy: సీఎం సీఎం పై రాళ్ల దాడిని ఖండించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్మోహన్ రెడ్డి పై ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పురందేశ్వరి ఘాటుగా విమార్చించడం, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని అన్నారు. సిద్ధం సభలు, బస్సు యాత్ర విజయవంతం చూసి ఓర్వలేక కూటమి ఇలాంటి దుశ్చర్యలు చేస్తుందని ఆరోపించారు.

ALSO READ: సీఎం జగన్‌ను చంపాలని చూస్తున్నారు.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

మొదటి నుండే సీఎం జగన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కూటమి మాటల్లోనే నైరాశ్యం కనబడుతోంది, ద్వేషం కనబడుతోందని వ్యాఖ్యానించారు. కూటమి నేతలు రాజకీయ విలువలు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పై కుట్రపూరితంగా ఈ దాడి చేశారని పేర్కొన్నారు. అందరికి సంబంధం ఉందొ లేదో కానీ లోకేష్ ట్విట్టర్ చూశాక ఇది తెలుగుదేశం పార్టీ కుట్ర అనే తెలిస్తుందని విమర్శించారు.

రాయి వేస్తే ఎక్కడ తగులుతుందో ఎవరికి తెలియదు మనం ఎందుకు కొట్టించుకుంటాం అని ప్రశ్నించారు. ఈ దాడి ని ప్రజలు లైట్ తీసుకోవాలని 2019 కోడి కత్తి, 2024లో రాయి దాడి అని చెప్పేది సబబు కాదని అన్నారు. ఖచ్చితంగా ఈ దాడి తెలుగుదేశం పార్టీ వ్యక్తులే చేశారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. బస్సు యాత్ర సక్సెస్ అయ్యిందనే ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని అన్నారు. స్కూల్ దగ్గర నుంచి లోకేష్ రాయి తో కొట్టించుకుంటే ఆ రాయి ఎక్కడ తగులుతుందో చెప్పాలని అన్నారు. రాయి తో కొట్టి కూడా ఇంత నీచంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు యాక్షన్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి కు చేయడం తెలియదని అన్నారు.

#lokesh #peddi-reddy #chandrababu #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe