Andhra Pradesh: అప్పుల లెక్కలు తేల్చండి.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యాశాఖ అధికారులతో భేటీ అయ్యారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు వివరాలు ఇవ్వాలని.. అప్పుల లెక్కలు తేల్చాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాకల్టీ ఖాళీల వివరాలపై నివేదిక ఇవ్వాలన్నారు.

New Update
Lokesh: తన భద్రతపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

Minister Nara Lokesh: ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ ఉన్నత విద్యాశాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యాదీవెన (Vidya Deevena), వసతి దీవెన బకాయిలు వివరాలు ఇవ్వాలని.. అప్పుల లెక్కలు తేల్చాలని సూచించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాకల్టీ ఖాళీల వివరాలపై నివేదిక ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. బుధవారంలోగా అన్ని వివరాలు అందించాలని అధికారులకు లోకేష్ ఆదేశించారు.

Also Read: ‘ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడు’.. జగన్‌పై టీడీపీ కామెంట్స్

Advertisment
తాజా కథనాలు