KTR: ''ఆ పిల్లగాడిని మిస్సవుతున్న''..కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కేటీఆర్ తన కుమారుడ్ని మిస్సవుతున్నా అంటూ సోషల్ మీడియా (ఎక్స్‌) ద్వారా తన బాధను పంచుకున్నారు.కేటీఆర్‌...ట్విటర్‌ వేదికగా కుమారుడ్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.

New Update
KTR: ''ఆ పిల్లగాడిని మిస్సవుతున్న''..కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

కేటీఆర్(KTR) తనయుడు హిమాన్ష్‌ (Himansh) గురించి అందరికీ తెలిసిందే..తాతకి, తండ్రికి తగ్గ వారసుడిగా ఇప్పటికే ప్రజల నోట్లో నానుతుంటాడు. తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కేటీఆర్ తన కుమారుడ్ని మిస్సవుతున్నా అంటూ సోషల్ మీడియా (ఎక్స్‌) ద్వారా తన బాధను పంచుకున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ నాయకులందరూ ఫుల్‌ బిజీ అయిపోయారు. వారిలో కేటీఆర్‌ కూడా ఒకరు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన చేయాల్సిన పనులను కూడా కేటీఆర్ నే తలకెత్తుకున్నారు.

Also read: బచ్చలికూరతో కిడ్నీలో రాళ్లకు చెక్‌ పెట్టేద్దామా!

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఫుల్‌ బిజీగా కేటీఆర్‌...ట్విటర్‌ వేదికగా కుమారుడ్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం హిమాన్షు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. కొద్ది నెలల క్రితమే కేటీఆర్‌ సతీసమేతంగా వెళ్లి హిమాన్షు ను కాలేజీలో చేర్పించి వచ్చారు.

రోజులు గడుస్తున్న కొద్ది కేటీఆర్‌ హిమాన్షు మీద బెంగ పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన తన ట్విటర్‌ ఖాతాలో హిమాన్షుతో కలిసి నడుస్తున్న ఓ ఫోటోను షేర్‌ చేశారు. దానికి '' ఈ పిల్లగాడిని మిస్సవుతున్నా'' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కేటీఆర్ అమెరికా వెళ్లేందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు