Former Minister Narayana: నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ కొరివారికండ్రిగ, వడ్డిపాలెం ప్రాంతాల్లో పర్యటించారు మాజీ మంత్రి, డాక్టర్ పొంగూరు నారాయణ. స్థానిక టీడీపీ శ్రేణులు, ప్రజలు అడుగడుగునా ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిరువ్యాపారులు చేసుకునే మహిళలకు తోపుడుచెక్కబండ్లను అందజేసి నారాయణ దాతృత్వం చాటుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం ఇంటికి వెళ్లి బాబు ష్యూరిటీ – భవిష్యత్కు గ్యారెంటీ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు రావాలని, ఇందుకు అందరు మద్దతు తెలియజేయాలని ప్రజలను కోరారు.
పూర్తిగా చదవండి..Narayana: జగన్ సైకో..ఆయన వైఖరి కక్షసాధింపే: మాజీ మంత్రి నారాయణ
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న జగన్మోహన్రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు మాజీ మంత్రి నారాయణ. రాజధాని లేకుండా పరిపాలన చేయడమేంటీ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సైకో అంటూ ఎద్దేవా చేశారు. ఆయన వైఖరి కక్షసాధింపేనని కామెంట్స్ చేశారు.
Translate this News: