ముంబైలోని గోరేగావ్ వెస్ట్లోని జై భవానీ అనే 5 అంతస్తుల భవనంలో గురువారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భవనం కింది అంతస్తులోని దుకాణాలతో పాటు పార్కింగ్లో నిలిపి ఉంచిన వాహనాల్లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
పూర్తిగా చదవండి..Fire in Mumbai : ఐదంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం..!!
ముంబైలోని గోరేగావ్ వెస్ట్లోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఘటనాస్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనలో 40 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
Translate this News: