Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లా ఛోటే వెటియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నమ్మకద్రోహం కారణంగా భయంకరమైన ఎన్కౌంటర్ జరిగినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. అయితే ఈ పోరాటంలో అమరులైన వారికి సంబంధించి రకరకాలుగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వీరమరణం పొందిన మృతదేహాల వివరాలు వెల్లడించింది. ఈ మేరకు ‘మా ప్రియమైన సహచరుల పేర్లను పంపుతున్నాం. పోలీసుల ఎన్కౌంటర్ జరిగిన వెంటనే ప్రచారంలో ఉన్న పేర్లు సరైనవి కావు. దీంతో కొడుకులు, కూతుళ్ల విషయంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి మేము పంపిన పేర్లను మీ ఛానెల్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాం’ అంటూ మీడియాను కోరారు.
పూర్తిగా చదవండి..Chhattisgarh: కంకేర్ ఎన్ కౌంటర్.. అమరుల లిస్ట్ రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ!
ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. నమ్మకద్రోహం కారణంగానే భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ పోరాటంలో అమరులైన వారి జాబితాను రిలీజ్ చేసింది. వారి వివరాలను ప్రజలకు తెలియజేయాలని మీడియాను కోరింది.
Translate this News: