Maoist Encounter : చత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కీలకనేతలు నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

New Update
Chhattisgarh: దండకారణ్యంలో తుపాకుల మోత.. 11 మంది మృతి!

Maoist Encounter : చత్తీస్‌గడ్‌-మహారాష్ట్ర(Chhattisgarh-Maharashtra) సరిహద్దుల్లో మావోయిస్టు(Maoist) ల మీద పోలీసులు(Police) మరోసారి విరుచుకుపడ్డారు. ఈరోజు తెల్లవారుఘామున బారీ ఎన్‌కౌంటర్(Encounter) నిర్వహించారు. ఇందులో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారని కీలక సమాచారం అందుతోంది. మిగిలిన వారిని కూడా పట్టుకునేందుకు పోలీసులు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు ‍ జరిగాయి. చనిపోయిన వారంతా మావోయిస్టు అగ్రనేతలని.. తెలంగాణ(Telangana) రాష్ట్ర కమిటీ సభ్యులని అధికారులు ధృవీకరించారు. మంచిర్యాల డివిజన్‌ కమిటీ సెక్రటరీ వర్గీస్‌, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్‌ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌ చనిపోయిన వారిలో ఉన్నారు. ఇక చనిపోయిన మావోయిస్టుల మీద 36 లక్సల రివార్డులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

తెలంగాణలోని ప్రాణహిత నదిని దాటి గడ్చిరోలి వైపు వెళ్ళారు మావోయిస్టులు. అప్పుడే కూంబింగ్‌లో ఉన్న పోలీసులకు వీరు కనిపించారు. దీంతో ఇరువైపులా కాల్పులు జరిగాయి. మహారాష్ట్రలోని SPS రేపన్‌పల్లికి 5 కిలోమీటర్ల దూరంలోని కొలమార్క కొండల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టుల దగ్గర నుంచి ఏకే 47, ఒక కార్బైన్, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, నక్సల్ సాహిత్యం, వస్తువులు, భారీ పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో డిఫెక్ట్

Advertisment
తాజా కథనాలు