Mahabubnagar: RSP డమ్మీ అభ్యర్థి.. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు: మల్లు రవి ఫైర్!

ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ఒక డమ్మీ అభ్యర్థి అన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన తన గెలుపును ఆపలేరన్నారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందన్నారు.

Mahabubnagar: RSP డమ్మీ అభ్యర్థి.. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు: మల్లు రవి ఫైర్!
New Update

Mallu ravi: బీఎస్పీనుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. కాగా సోమవారం మీడియాతో మాట్లాడిన మల్లు రవి.. ప్రవీణ్‌ కుమార్ ను ఒక డమ్మీ అభ్యర్థిగా పేర్కొన్నారు.

ఎన్ని కుట్రలు చేసిన ఆపలేరు..
ఈ మేరకు బీఆర్ఎస్, కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన నాగర్ కర్నూల్‌లో గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని మెజార్టీ సీట్లలో గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను నిలబెడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమ్మక్కయ్యారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా తన గెలుపును ఆపలేరన్నారు.

ఇది కూడా చదవండి : Revanth: మనువడితో హోలీ ఆడిన సీఎం రేవంత్.. ఫొటోస్ వైరల్!

ఇక నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్పీ, బీజేపీ నుంచి నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ పోటీ చేయబోతున్నారు. అయితే ఆర్ఎస్ పీ, మల్లు రవి మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.

#rs-praveen-kumar #nagarkurnool #mallu-ravi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి