BREAKING: 'INDIA'కూటమి చైర్‌పర్సన్‌గా ఖర్గే..!

కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే పేరును INDIA బ్లాక్‌ చైర్‌పర్సన్‌గా ఓకే చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కన్వీనర్ పదవికి బీహార్ సీఎం నితీశ్‌ కుమార్ పేరు కూడా వచ్చింది. అయితే నితీశ్‌ మాత్రం తాను ఏ పదవి కోసం వెంపర్లాడలేదని బదులిచ్చినట్టుగా సమాచారం.

New Update
BREAKING: 'INDIA'కూటమి చైర్‌పర్సన్‌గా ఖర్గే..!

కాంగ్రెస్‌(Congress) అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే(Mallikarjun Kharge) ప్రతిపక్ష భారత కూటమికి చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. శనివారం జరిగిన టాప్ INDIA బ్లాక్ నేతల వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి హాజరుకాని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి ఈ నిర్ణయం గురించి తెలియజేస్తామని కూటమిలోని కీలక నేతలు చెప్పారు. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరైనా కన్వీనర్ పదవిని చేపట్టాలని నితీష్ కుమార్ సైతం చెప్పినట్టు సమాచారం. నిజానికి ఈ పదవిని నితీశ్‌కు ఇవ్వాలని ముందుగా అనున్నారట. ఈ విషయాన్ని జేడీ(యూ) నాయకుడు సంజయ్ ఝా తెలిపారు. అన్ని పార్టీలు ఏకీభవిస్తేనే తను ఈ పాత్రను అంగీకరిస్తానని నితీశ్‌ కుమార్ చెప్పినట్టు సమాచారం. అయితే చివరకు ఖర్గేను ఎన్నుకున్నారు.

వ్యతిరేకించిన టీఎంసీ:
2024 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పడిన కూటమి, వివాదాస్పద కన్వీనర్ నియామకంతో సహా అనేక సమస్యలపై అంతర్గత నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది. జేడీ(యూ) నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా కోరుకున్నప్పటికీ టీఎంసీ అందుకు వ్యతిరేకించింది. ఇక సీట్ల భాగస్వామ్య ఎజెండా, భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనడం, కూటమికి సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశాలను సమీక్షించడానికి INDIA కూటమి నాయకుల వర్చువల్ సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన విషయం తెలిసిందే.

నిలువరిస్తారా?
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ ముంబైలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన INDIA బ్లాక్ నేతల సమావేశానికి హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, పార్టీ అధినేత్రి కనిమొళి కరుణానిధి చెన్నైలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. INDIA కూటమి నేతలు ఇలా వర్చువల్‌గా భేటీకావడం ఇది రెండోసారి. మరోవైపు మోదీ చరిష్మాను తట్టుకుని ఖర్గే నిలవగలరా అన్నది చర్చనీయమవుతోంది. చీటికీ మాటికీ గాంధీ కుటుంబాన్ని తాను కలవబోనంటూ మొదట్లో ప్రకటించి స్వతంత్రతను చాటుకునే ప్రయత్నం చేసిన ఖర్గే కొన్ని సవాళ్లను బాగానే అధిగమించారు. తాను రబ్బర్‌ స్టాంపును కాదన్న సంకేతాలిచ్చారు. సౌమ్యుడిగా, కాంగ్రెస్‌లో వివాదాలు పరిష్కరించడంలో ట్రబుల్‌ షూటర్‌గా ఖర్గేకు మంచిపేరుంది. అయినప్పటికీ కూటమిలో ఎత్తులు, వ్యూహాలకు తోడు పార్టీలో అంతర్గత అసంతృప్తులనూ ఖర్గే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాటలు, వ్యూహాల్లో మోదీ షా ద్వయాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Also Read: అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ షెడ్యూల్‌లో మార్పు

WATCH:

Advertisment
తాజా కథనాలు